క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు రానేవచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు మినీ ప్రపంచకప్ దుబాయిలో జరగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అందులో నాలుగు జట్లకు వరల్డ్ కప్ ఛాన్స్ లభిస్తుంది.
రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్ మరియు పపువా – న్యూగినియాల మధ్య మ్యాచ్తో అక్టోబర్ 17న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్కాట్లాండ్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మరో మ్యాచ్ షెడ్యూల్ చేశారు. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి.
గ్రూప్ – బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్నకు అర్హత సాధిస్తాయి. రౌండ్ 2లో భాగంగా అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.
This post was last modified on August 17, 2021 3:31 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…