క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు రానేవచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు మినీ ప్రపంచకప్ దుబాయిలో జరగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. మిగతా 4 స్థానాల కోసం మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అందులో నాలుగు జట్లకు వరల్డ్ కప్ ఛాన్స్ లభిస్తుంది.
రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్ మరియు పపువా – న్యూగినియాల మధ్య మ్యాచ్తో అక్టోబర్ 17న ఈ మెగా ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్కాట్లాండ్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మరో మ్యాచ్ షెడ్యూల్ చేశారు. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి.
గ్రూప్ – బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్నకు అర్హత సాధిస్తాయి. రౌండ్ 2లో భాగంగా అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.
This post was last modified on August 17, 2021 3:31 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…