Trends

ఆప్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న క్రికెటర్ రషీద్ కుటుంబం..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. మొత్తం దేశం తాలిబన్ల హస్తగతమైంది. దీంతో.. ఆ దేశ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా.. ఈ ప్రమాదంలో తన కుటుంబం కూడా ఇరుక్కుపోయిందంటూ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కొద్ది రోజుల క్రితమే.. రషీద్ ఖాన్.. తన దేశం ప్రమాదంలో ఉందని.. రక్షించడండి అంటూ ప్రపంచ దేశాలను కోరాడు. ఆయన ట్వీట్ చేసిన ఐదు రోజులకే తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తమ హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి దాడులు చేయడం లేదని, శాంతియుతంగా అధికారం హస్తగతం చేయాలని ఆ ముష్కరులు సూచించారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం విదేశాలకు పారిపోయాడు.

రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ లో ఏముందంటే..
తాను ఇంగ్లాండ్‌లో ఉన్నానని, కానీ తన దేశం ఆపదలో ఉందని.. సామాన్య ప్రజలు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా తన కుటుంబం గురించి అఫ్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అధికంగా ఆందోళన చెందుతున్నాడు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోగా, తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉందని రషీద్ బాధపడుతున్నాడు. రషీద్ ఖాన్‌తో పాటు మహ్మద్ నబీ సైతం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు. హండ్రెడ్ లీగ్‌లో భాగంగా రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు, లండన్ స్పింట్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు విదేశాలలో ఉన్నా, తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నానని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో తన బాధను షేర్ చేసుకున్నాడు. తన కుటుంబం, దేశం గురించి ఆందోళన చెందుతున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.

This post was last modified on August 16, 2021 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

60 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago