Trends

ఆప్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న క్రికెటర్ రషీద్ కుటుంబం..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. మొత్తం దేశం తాలిబన్ల హస్తగతమైంది. దీంతో.. ఆ దేశ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా.. ఈ ప్రమాదంలో తన కుటుంబం కూడా ఇరుక్కుపోయిందంటూ యువ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కొద్ది రోజుల క్రితమే.. రషీద్ ఖాన్.. తన దేశం ప్రమాదంలో ఉందని.. రక్షించడండి అంటూ ప్రపంచ దేశాలను కోరాడు. ఆయన ట్వీట్ చేసిన ఐదు రోజులకే తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తమ హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి దాడులు చేయడం లేదని, శాంతియుతంగా అధికారం హస్తగతం చేయాలని ఆ ముష్కరులు సూచించారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సైతం విదేశాలకు పారిపోయాడు.

రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ లో ఏముందంటే..
తాను ఇంగ్లాండ్‌లో ఉన్నానని, కానీ తన దేశం ఆపదలో ఉందని.. సామాన్య ప్రజలు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా తన కుటుంబం గురించి అఫ్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ అధికంగా ఆందోళన చెందుతున్నాడు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకోగా, తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉందని రషీద్ బాధపడుతున్నాడు. రషీద్ ఖాన్‌తో పాటు మహ్మద్ నబీ సైతం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు. హండ్రెడ్ లీగ్‌లో భాగంగా రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు, లండన్ స్పింట్స్‌కు నబీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు విదేశాలలో ఉన్నా, తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నానని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో తన బాధను షేర్ చేసుకున్నాడు. తన కుటుంబం, దేశం గురించి ఆందోళన చెందుతున్న రషీద్ ఖాన్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.

This post was last modified on August 16, 2021 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

8 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

48 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago