మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్.. మరే క్రీడకూ లేదనే చెప్పాలి. టీవీలో మ్యాచ్ వస్తోందంటే చాలు.. చిన్నా. పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఐపీఎల్ అంటే.. మరింత ఎక్కువ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. అయితే.. ఇంత క్రేజ్ ఉన్నా.. ఇప్పటి వరకు.. క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు దక్కలేదు. కానీ.. తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ తీపి కబురు చెప్పింది. ఒలంపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ ను చేర్చాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది.
దీనికోసం ప్రత్యేకంగా బిడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ ప్రకటించేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 శాతం క్రికెట్ మ్యాచ్లకు అభిమానులు ఉన్నారని పేర్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…. ఒలంపిక్స్లో ఎలాగైనా క్రికెట్ ను అమలు చేయాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చితే…. చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…