మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్.. మరే క్రీడకూ లేదనే చెప్పాలి. టీవీలో మ్యాచ్ వస్తోందంటే చాలు.. చిన్నా. పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఐపీఎల్ అంటే.. మరింత ఎక్కువ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. అయితే.. ఇంత క్రేజ్ ఉన్నా.. ఇప్పటి వరకు.. క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు దక్కలేదు. కానీ.. తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ తీపి కబురు చెప్పింది. ఒలంపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ ను చేర్చాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది.
దీనికోసం ప్రత్యేకంగా బిడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ ప్రకటించేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 శాతం క్రికెట్ మ్యాచ్లకు అభిమానులు ఉన్నారని పేర్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…. ఒలంపిక్స్లో ఎలాగైనా క్రికెట్ ను అమలు చేయాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చితే…. చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…