మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్.. మరే క్రీడకూ లేదనే చెప్పాలి. టీవీలో మ్యాచ్ వస్తోందంటే చాలు.. చిన్నా. పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఐపీఎల్ అంటే.. మరింత ఎక్కువ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. అయితే.. ఇంత క్రేజ్ ఉన్నా.. ఇప్పటి వరకు.. క్రికెట్ కి ఒలంపిక్స్ లో చోటు దక్కలేదు. కానీ.. తాజాగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ తీపి కబురు చెప్పింది. ఒలంపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ ను చేర్చాలని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది.
దీనికోసం ప్రత్యేకంగా బిడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ ప్రకటించేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 శాతం క్రికెట్ మ్యాచ్లకు అభిమానులు ఉన్నారని పేర్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్…. ఒలంపిక్స్లో ఎలాగైనా క్రికెట్ ను అమలు చేయాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చితే…. చాలా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ.
This post was last modified on August 11, 2021 10:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…