Trends

ఇదేం బాలేదు మోడీ గారు !

కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షతో వ్యవహరిస్తోందో అందరికీ అర్ధమైపోయింది. టోక్యో ఒలంపిక్స్ లో షటిల్ బాడ్మింటన్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇండియాకు తిరిగివచ్చిన పీవీ సింధు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. టోక్యో నుండి ఢిల్లీకి మంగళవారం చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలోనే ఘనస్వాగతం లభించింది. సరే ఈ స్వాగతాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని అనుకుందాం. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు.

ఒక్క ఠాకూరే కాదు ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, క్రీడా శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ తో పాటు చాలామంది ఎంపిలు తదితరులు పాల్గొన్నారు. సింధు సాధించిన విజయం గురించి చాలా గొప్పగా ప్రశంశించారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులను లేదా పాల్గొన్న క్రీడాకారులను ప్రోత్సహించటంలో తప్పేలేదు. కానీ ఇదే విధమైన కార్యక్రమం భారత్ కు సిల్వర్ మెడల్ సాధించిన చాను సైకోం మీరాబాయ్ టోక్యో నుండి వచ్చినపుడు ఎందుకు నిర్వహించలేదు ?

సింధు తెచ్చింది బ్రాంజ్ మెడల్ మాత్రమే కానీ చాను తెచ్చింది సిల్వర్ మెడల్. టోక్యో నుండి చాను వచ్చినపుడు చాలాకొద్దిమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రముఖులు మాత్రమే స్వాగతం పలికారంతే. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రుల్లో ఎవరూ పాల్గొనలేదు. సింధు అభినందన సభ జరిపినట్లే చానుకు అభినందన సభ నిర్వహించలేదు. మనదేశంలో షటిల్ కున్న పాపులారిటీ వెయిట్ లిఫ్టింగ్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాగే సెల్ఫ్ మార్కెటింగ్ లో సింధు కున్న సామర్ధ్యం చానుకు లేకపోవచ్చు. కానీ ఇక్కడ వ్యక్తిగత సామర్ధ్యంతోనో లేకపోతే స్పాన్సరింగ్ తోనే ఏమీ సంబంధంలేదు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికుంది. పైగా సింధు సాధించింది బ్రాంజ్ మెడల్ మాత్రమే అయితే చాను తెచ్చింది సిల్వర్ మెడల్ అన్నది మరచిపోకూడదు. కేంద్రం చూపిస్తున్న ఇటువంటి వివక్ష క్రీడాకారుల మానసిక పరిస్దితిపై తీవ్రంగా పడుతుందని పెద్దలు గ్రహించాలి.

This post was last modified on August 4, 2021 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

4 minutes ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

25 minutes ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

58 minutes ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

2 hours ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

2 hours ago

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

2 hours ago