Trends

ఇదేం బాలేదు మోడీ గారు !

కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షతో వ్యవహరిస్తోందో అందరికీ అర్ధమైపోయింది. టోక్యో ఒలంపిక్స్ లో షటిల్ బాడ్మింటన్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇండియాకు తిరిగివచ్చిన పీవీ సింధు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. టోక్యో నుండి ఢిల్లీకి మంగళవారం చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలోనే ఘనస్వాగతం లభించింది. సరే ఈ స్వాగతాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని అనుకుందాం. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు.

ఒక్క ఠాకూరే కాదు ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, క్రీడా శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ తో పాటు చాలామంది ఎంపిలు తదితరులు పాల్గొన్నారు. సింధు సాధించిన విజయం గురించి చాలా గొప్పగా ప్రశంశించారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులను లేదా పాల్గొన్న క్రీడాకారులను ప్రోత్సహించటంలో తప్పేలేదు. కానీ ఇదే విధమైన కార్యక్రమం భారత్ కు సిల్వర్ మెడల్ సాధించిన చాను సైకోం మీరాబాయ్ టోక్యో నుండి వచ్చినపుడు ఎందుకు నిర్వహించలేదు ?

సింధు తెచ్చింది బ్రాంజ్ మెడల్ మాత్రమే కానీ చాను తెచ్చింది సిల్వర్ మెడల్. టోక్యో నుండి చాను వచ్చినపుడు చాలాకొద్దిమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రముఖులు మాత్రమే స్వాగతం పలికారంతే. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రుల్లో ఎవరూ పాల్గొనలేదు. సింధు అభినందన సభ జరిపినట్లే చానుకు అభినందన సభ నిర్వహించలేదు. మనదేశంలో షటిల్ కున్న పాపులారిటీ వెయిట్ లిఫ్టింగ్ కు లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాగే సెల్ఫ్ మార్కెటింగ్ లో సింధు కున్న సామర్ధ్యం చానుకు లేకపోవచ్చు. కానీ ఇక్కడ వ్యక్తిగత సామర్ధ్యంతోనో లేకపోతే స్పాన్సరింగ్ తోనే ఏమీ సంబంధంలేదు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికుంది. పైగా సింధు సాధించింది బ్రాంజ్ మెడల్ మాత్రమే అయితే చాను తెచ్చింది సిల్వర్ మెడల్ అన్నది మరచిపోకూడదు. కేంద్రం చూపిస్తున్న ఇటువంటి వివక్ష క్రీడాకారుల మానసిక పరిస్దితిపై తీవ్రంగా పడుతుందని పెద్దలు గ్రహించాలి.

This post was last modified on August 4, 2021 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

25 minutes ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

2 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

3 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

3 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

11 hours ago