గోల్డ్ మిస్ అయ్యింది.. కాంస్యం దక్కేనా?

పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ చేజార్చుకుంది. పురుషుల హాకీ సెమీ ఫైనల్‌లో బెల్జియంపై 5-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు కాంస్య పతకం కోసం ఆడనుంది. మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి 2-1 ఆధిక్యంలోకి భారత్ నిలిచింది,

అయితే చివరి క్వార్టర్‌లో మూడు గోల్స్ చేసి ప్రత్యర్థికి విజయాన్ని అందజేయడంతో భారత్ ఓటమి పాలైంది. భారత్ తరఫున మన్ దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, బెల్జియం తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ అద్భుతమైన హ్యాట్రిక్ సాధించారు. సెమీ ఫైనల్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది.

ఫ‌స్ట్ హాఫ్‌లో మ‌న్‌ దీప్ సింగ్‌, హ‌ర్మ‌న్‌ ప్రీత్ సింగ్‌ చెరో గోల్ వేశారు. అయితే బెల్జియం ఆట‌గాడు అలెగ్జాండ‌ర్ హెండ్రిక్స్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టి భారత్ పసిడి ఆశలపై నీళ్లు చల్లాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పలేదు.

కాంస్యం కోసం 5న మ‌రో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. సాయంత్రం ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ లో ఓడిపోయిన జ‌ట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే.. మనకు కాంస్యం దక్కుతుంది.