టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి మరో పతకం దక్కింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పతకం సాధించింది తెలుగు తేజం పీవీ సింధు. చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో జరిగిన పోరులో గెలిచి కాంస్యం దక్కించుకుంది. 21-13, 21-15 తేడాతో సింధు అద్భుత విజయం సాధించింది.
శనివారం, సింధు సెమీ-ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ చైనీస్ తైపీకి చెందిన తాయ్ త్జుతో తలపడింది, ఆమె శనివారం 18-21, 12-21తో ఓడిపోయింది. దీంతో బంగారు, సిల్వర్ పతకం చేజార్జుకోవాల్సి వచ్చింది. నేటి మ్యాచ్ లో విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది.
ఏస్ ఇండియన్ షట్లర్ రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ సింధు కావడం గమనార్హం. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.ఇప్పుడు కాంస్యం సాధించింది.
ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు రెజ్లర్ సుశీల్ కుమార్. అతను 2008 బీజింగ్లో గేమ్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు మరియు లండన్ గేమ్స్లో ఒక మెట్టు మెరుగ్గా వెండి పతకాన్ని సాధించాడు, దేశానికి ఏకైక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయ్యాడు, ఇప్పుడు సింధు అతని సరసన నిలిచింది.
This post was last modified on August 1, 2021 6:44 pm
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…