ప్రస్తుతం ఎక్కడ చూసినా.. టోక్యో ఒలంపిక్స్ పేరే వినపడుతోంది. ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుంది.. ఎవరెవరికు దేశానికి పతకాలతో తిరిగివస్తారంటూ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ లో ఆటతోపాటు.. చాలా విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న ఓ కోచ్.. అథ్లెట్ కి ప్రపోజ్ చేయడం వైరల్ గా మారితే.. నిన్న.. ఓ కోచ్.. ఆటకి ముందు ప్లేయర్ చెంప పగలకొట్టడం విమర్శలకు దారితీసింది. తాజాగా.. ఓ క్రీడాకారిణి తన ఆట కోసం.. ఆటలో గెలవడం కోసం కండోమ్ వాడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం.
ఈ ఒలంపిక్స్ లో అధికారులు అథ్లెట్స్ కి కండోమ్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే . అయితే.. వాటిని సెక్స్ కోసం వినియోగించవద్దని.. కావాలంటే మీ దేశం తీసుకువెళ్లండి అంటూ.. అధికారులు క్రీడాకారులకు చెప్పారు.
కాగా.. ఆ కండోమ్ ఉపయోగించుకొని.. ఓ క్రీడాకారిణి పతకం గెలిచింది. నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. కండోమ్ లేకపోయి ఉంటే.. ఆమె ఓడిపోయేది. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. కండోమ్ ని వినియోగించింది. ఫలితంగా విజయం సాధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(27) కండోమ్ వాడి బ్రాంజ్(కాంస్యం) మెడల్ గెలిచింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.
జెస్సికా ఫాక్స్ తను ఎదుర్కొన్న సమస్యకు కండోమ్ సాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని తన కోచ్ పిండి పదార్ధం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. అలా పడవకు రిపేర్ చేసి రేస్ ముగించింది. ఈ సీక్రెట్ ను తాజాగా ఆమే సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఆమె సమయస్ఫూర్తి చూసి.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on July 30, 2021 1:55 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…