ప్రస్తుతం ఎక్కడ చూసినా.. టోక్యో ఒలంపిక్స్ పేరే వినపడుతోంది. ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుస్తుంది.. ఎవరెవరికు దేశానికి పతకాలతో తిరిగివస్తారంటూ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ లో ఆటతోపాటు.. చాలా విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న ఓ కోచ్.. అథ్లెట్ కి ప్రపోజ్ చేయడం వైరల్ గా మారితే.. నిన్న.. ఓ కోచ్.. ఆటకి ముందు ప్లేయర్ చెంప పగలకొట్టడం విమర్శలకు దారితీసింది. తాజాగా.. ఓ క్రీడాకారిణి తన ఆట కోసం.. ఆటలో గెలవడం కోసం కండోమ్ వాడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం.
ఈ ఒలంపిక్స్ లో అధికారులు అథ్లెట్స్ కి కండోమ్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే . అయితే.. వాటిని సెక్స్ కోసం వినియోగించవద్దని.. కావాలంటే మీ దేశం తీసుకువెళ్లండి అంటూ.. అధికారులు క్రీడాకారులకు చెప్పారు.
కాగా.. ఆ కండోమ్ ఉపయోగించుకొని.. ఓ క్రీడాకారిణి పతకం గెలిచింది. నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. కండోమ్ లేకపోయి ఉంటే.. ఆమె ఓడిపోయేది. చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. కండోమ్ ని వినియోగించింది. ఫలితంగా విజయం సాధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(27) కండోమ్ వాడి బ్రాంజ్(కాంస్యం) మెడల్ గెలిచింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.
జెస్సికా ఫాక్స్ తను ఎదుర్కొన్న సమస్యకు కండోమ్ సాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని తన కోచ్ పిండి పదార్ధం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. అలా పడవకు రిపేర్ చేసి రేస్ ముగించింది. ఈ సీక్రెట్ ను తాజాగా ఆమే సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఆమె సమయస్ఫూర్తి చూసి.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on July 30, 2021 1:55 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…