భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు.
కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రైనా.. అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. సహచర కామెంటేటర్ ఒకరు ఓ ప్రశ్న అడిగాడు. ధోతీ ధరిస్తూ.. విజిలేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావు అని రైనాను ప్రశ్నించాడు.
దీనికి రైనా బదులిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను.. ఇక్కడి సంస్కృతిని బాగా ఇష్టపడతాను’’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ ఉండరా.. బ్రాహ్మణులు మాత్రమే ధోతీ కడతారా.. సంప్రదాయబద్ధంగా ఉంటారా.. చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ రైనా మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అవసరం లేని చోట కులం గురించి మాట్లాడి.. తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం ఎందుకని రైనాను ఇంకొందరు నిలదీశారు. మొత్తానికి రైనా ఏదో యధాలాపంగా చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అతణ్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఐతే రైనాను ఇలా ఎటాక్ చేయడం చూసి అతడి అభిమానులు.. #Isupportsureshraina అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడి మద్దతుగా ట్వీట్లు వేశారు.
This post was last modified on July 23, 2021 12:28 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…