భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు.
కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రైనా.. అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. సహచర కామెంటేటర్ ఒకరు ఓ ప్రశ్న అడిగాడు. ధోతీ ధరిస్తూ.. విజిలేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావు అని రైనాను ప్రశ్నించాడు.
దీనికి రైనా బదులిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను.. ఇక్కడి సంస్కృతిని బాగా ఇష్టపడతాను’’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ ఉండరా.. బ్రాహ్మణులు మాత్రమే ధోతీ కడతారా.. సంప్రదాయబద్ధంగా ఉంటారా.. చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ రైనా మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అవసరం లేని చోట కులం గురించి మాట్లాడి.. తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం ఎందుకని రైనాను ఇంకొందరు నిలదీశారు. మొత్తానికి రైనా ఏదో యధాలాపంగా చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అతణ్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఐతే రైనాను ఇలా ఎటాక్ చేయడం చూసి అతడి అభిమానులు.. #Isupportsureshraina అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడి మద్దతుగా ట్వీట్లు వేశారు.
This post was last modified on July 23, 2021 12:28 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…