Trends

సురేష్ రైనా కామెంట్.. రచ్చ రచ్చ


భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు.

కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రైనా.. అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. సహచర కామెంటేటర్ ఒకరు ఓ ప్రశ్న అడిగాడు. ధోతీ ధరిస్తూ.. విజిలేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావు అని రైనాను ప్రశ్నించాడు.

దీనికి రైనా బదులిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను.. ఇక్కడి సంస్కృతిని బాగా ఇష్టపడతాను’’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ ఉండరా.. బ్రాహ్మణులు మాత్రమే ధోతీ కడతారా.. సంప్రదాయబద్ధంగా ఉంటారా.. చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ రైనా మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

అవసరం లేని చోట కులం గురించి మాట్లాడి.. తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం ఎందుకని రైనాను ఇంకొందరు నిలదీశారు. మొత్తానికి రైనా ఏదో యధాలాపంగా చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అతణ్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఐతే రైనాను ఇలా ఎటాక్ చేయడం చూసి అతడి అభిమానులు.. #Isupportsureshraina అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడి మద్దతుగా ట్వీట్లు వేశారు.

This post was last modified on July 23, 2021 12:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

8 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

8 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

10 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

10 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

12 hours ago