భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి అతను అర్ధంతరంగా తప్పుకుని ఇంటికి వచ్చేయడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్ నుంచి అలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. చివరికి ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయారు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను మళ్లీ చెన్నైకి ఆడాడు.
కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు ప్రిమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రైనా.. అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. సహచర కామెంటేటర్ ఒకరు ఓ ప్రశ్న అడిగాడు. ధోతీ ధరిస్తూ.. విజిలేస్తూ.. డ్యాన్స్ చేస్తూ చెన్నై సంస్కృతిలో ఎలా కలిసిపోయావు అని రైనాను ప్రశ్నించాడు.
దీనికి రైనా బదులిస్తూ.. ‘‘నేను కూడా బ్రాహ్మణుడినే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. నేను నా సహచరులను.. ఇక్కడి సంస్కృతిని బాగా ఇష్టపడతాను’’ అన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. చెన్నై అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ ఉండరా.. బ్రాహ్మణులు మాత్రమే ధోతీ కడతారా.. సంప్రదాయబద్ధంగా ఉంటారా.. చెన్నైకి ఆడుతూ ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ రైనా మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
అవసరం లేని చోట కులం గురించి మాట్లాడి.. తాను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం ఎందుకని రైనాను ఇంకొందరు నిలదీశారు. మొత్తానికి రైనా ఏదో యధాలాపంగా చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. అతణ్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు వేశారు. ఐతే రైనాను ఇలా ఎటాక్ చేయడం చూసి అతడి అభిమానులు.. #Isupportsureshraina అంటూ మరో హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడి మద్దతుగా ట్వీట్లు వేశారు.
This post was last modified on July 23, 2021 12:28 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…