#tamilsrejectramrajproducts.. బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన బట్టల దుకాణాల్లో రామ్ రాజ్ కాటన్స్ ఒకటి. అది మొదలైంది తమిళనాడులో. తర్వాత కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోనూ విస్తరించింది. ఉత్తరాదిన కూడా అక్కడక్కడా స్టోర్లు ఉన్నాయి. మరి రామ్ రాజ్ ఉత్పత్తులను స్వయంగా తమిళులే బాయ్కాట్ చేయడం ఏంటి అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆ సంస్థ ఉద్యోగాల కోసం ఇచ్చిన ఒక ప్రకటనే తమిళ జనాల ఆగ్రహానికి కారణం. తమిళనాడులోని మధురై, తిరుప్పూరు ప్రాంతాల్లో తమ సంస్థలో ఉన్న ఖాళీలకు రామ్ రాజ్ కాటన్ వాళ్లు ఇచ్చిన ప్రకటనలో.. ఐటీ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల అర్హతల్లో ‘తెలుగువారికి ప్రాధాన్యం’ అని పేర్కొన్నారు. అది తమిళ జనాలకు రుచించలేదు.
తమిళనాడులో తమిళ సంస్థలో ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి.. తెలుగు వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం పట్ల తమిళ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై సహా కొన్ని సిటీల్లో తెలుగు వారు చాలా ఉద్యోగాలు దక్కించుకున్నారని.. అలాంటిది ఇప్పుడు ఓ తమిళ సంస్థ ఏరికోరి తెలుగు వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటన్నది తమిళ జనాల అభ్యంతరం. అందుకే రామ్ రాజ్ మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తూ ట్విట్టర్లో ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులేమీ వాడమంటూ తమిళ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు.
ఇలా ప్రకటన ఇచ్చినందుకు రామ్ రాజ్ కాటన్ యాజమాన్యం క్షమాపణ చెప్పి, సదరు ఉద్యోగాలను తమిళులకే ఇవ్వాలని.. లేదంటే ఇకపై రామ్ రాజ్ ఉత్పత్తులే కొనమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమిళ జనాల పట్టుదల ఎలా ఉంటుందో తెలిసిందే కాబట్టి వారి డిమాండ్లకు రామ్ రాజ్ కాటన్స్ తలొగ్గక తప్పదేమో.
This post was last modified on July 22, 2021 10:43 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…