కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. తీవ్ర ప్రభావం చూపించాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అయితే… ఈ కరోనా కారణంగా.. గత ఏడాది నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు ధైర్యం చేసి స్కూళ్లు తెరుద్దామని అనుకునేలోపు.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఒక వేళ కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా అనిపిస్తే… ముందుగా పెద్ద తరగతుల విద్యార్థులకు పాఠశాలలు, కాలేజీలు తెరవాలని అనుకుంటున్నారు. అయితే… ఈ విషయంలో ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన చేసింది.
పాఠశాలలు తెరిచే ఆలోచన ఉంటే.. ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ను వేయాలని ఐసీఎంఆర్ సూచించింది. పెద్దల కన్నా పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్లను బాగా తట్టుకుంటారని, కనుక ముందుగా ప్రైమరీ స్కూళ్లను ఓపెన్ చేయాలని సూచించింది. యాంటీ బాడీలు పెద్దలు, పిల్లల్లో ఒకే రకంగా ఉంటున్నాయని స్పష్టం చేసింది.
స్కాండినేవియాలో కొన్ని ప్రైమరీ స్కూళ్లను తెరిచే ఉంచారనే విషయాన్ని ఈ సందర్బంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు. పిల్లల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతరం అయిన కేసులు దాదాపుగా లేవన్నారు. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన సీరో సర్వేలో మూడింట రెండు వంతుల మందిలోనే యాంటీ బాడీలు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని, 40 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. అయితే ప్రైమరీ స్కూళ్లను తెరిస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on July 21, 2021 4:13 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…