Trends

జియో.. నెల రోజుల్లో 78 వేల కోట్లు

కరోనా వేళ.. అన్ని కంపెనీలకూ ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రెండు మూడు నెలలుగా మార్కెట్ ఎలా కుదేలవుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముఖేష్ అంబానీ సంస్థ రిలయెన్స్ జియో మాత్రం దూసుకెళ్తున్నాయి. ఆ సంస్థలోకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఆ సంస్థలోకి ఏకంగా రూ.78 వేల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయంటే ఆ సంస్థ ఎలా వెలిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ప్రైవేట్ ఈక్విటీ ఫిర్మ్ కేకేఆర్.. రిలయన్స్ జియోలో రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఐతే అంత మొత్తం పెట్టుబడి పెట్టినా సంస్థలో దాని వాటా 2.32 శాతం మాత్రమే. జియో సంస్థ ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఏకంగా రూ.5.16 లక్షల కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆసియాలో కేకేఆర్ సంస్థ అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం.

గత నెల రోజుల వ్యవధిలోనే జియో సంస్థలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. సోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ ఆ సంస్థలో ఏకంగా రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టింది. తద్వారా దానికి 9.99 శాతం వాటా దక్కింది. విస్తా సంస్థ రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటాను కొనుగోలు చేయగా.. జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లతో 1.34 శాతం వాటాను, సిల్వర్ లేక్ రూ.5,656 కోట్లతో 1.15 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి.

ఇలా నెల రోజుల వ్యవధిలో జియో ఏకంగా రూ.78,562 కోట్ల పెట్టుబడులు సంపాదించింది. మూడేళ్ల కిందట టెలికాం రంగంలోకి రావడంతోనే ప్రకంపనలు రేపిన జియో ఇన్ఫోకామ్.. ప్రస్తుతం దాదాపు 39 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో దేశంలో నెంబర్ వన్ టెలికాం సంస్థగా కొనసాగుతోంది. జియో కింద జియో సినిమా, జియో సావన్ లాంటి ఉప సంస్థలు కూడా ఉన్నాయి.

This post was last modified on May 23, 2020 10:05 am

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

33 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago