టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్లో డెల్టా వేరియెంట్ డేంజరస్గా మారింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. బయటపడింది.
బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్లోని తన సన్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడనుంది. దుర్హమ్లో కౌంటీ ఛాంపియన్ఫిప్-XI జట్టుతో తలపడనుంది.
ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో కరోనా వైరస్ బయటపడింది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ సమయంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారందరిలోనూ డెల్టా వేరియెంట్ కరోనానే బయటపడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates