ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి రూపాయాలు, సైలెంట్ జోన్స్ వద్ద పేలిస్తే రూ. 3 వేల జరిమానా విధించనుంది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాలు, వాణిజ్య సముదాయాల వద్ద టపాసులు కాల్చితే రూ. 10 వేలు, సెలైంట్జోన్లలో అయితే రూ. 20 వేలు ఫైన్ వసూలు చేయుంది.
ఒక వేళ ఇదే తప్పును రెండో సారి చేస్తే రూ. 40 వేలు ఫైన్ పడనుంది. రెండు సార్లు కన్నా ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రాకర్లు పేల్చితే లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. అదననంగా, జనరేటర్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు డిపిసిసి పలు చర్యలు తీసుకుంది. లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
This post was last modified on July 11, 2021 3:02 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…