ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి రూపాయాలు, సైలెంట్ జోన్స్ వద్ద పేలిస్తే రూ. 3 వేల జరిమానా విధించనుంది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాలు, వాణిజ్య సముదాయాల వద్ద టపాసులు కాల్చితే రూ. 10 వేలు, సెలైంట్జోన్లలో అయితే రూ. 20 వేలు ఫైన్ వసూలు చేయుంది.
ఒక వేళ ఇదే తప్పును రెండో సారి చేస్తే రూ. 40 వేలు ఫైన్ పడనుంది. రెండు సార్లు కన్నా ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రాకర్లు పేల్చితే లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. అదననంగా, జనరేటర్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు డిపిసిసి పలు చర్యలు తీసుకుంది. లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
This post was last modified on July 11, 2021 3:02 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…