ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి రూపాయాలు, సైలెంట్ జోన్స్ వద్ద పేలిస్తే రూ. 3 వేల జరిమానా విధించనుంది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాలు, వాణిజ్య సముదాయాల వద్ద టపాసులు కాల్చితే రూ. 10 వేలు, సెలైంట్జోన్లలో అయితే రూ. 20 వేలు ఫైన్ వసూలు చేయుంది.
ఒక వేళ ఇదే తప్పును రెండో సారి చేస్తే రూ. 40 వేలు ఫైన్ పడనుంది. రెండు సార్లు కన్నా ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రాకర్లు పేల్చితే లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. అదననంగా, జనరేటర్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు డిపిసిసి పలు చర్యలు తీసుకుంది. లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
This post was last modified on July 11, 2021 3:02 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…