ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఢిల్లీలో శబ్ద కాలుష్యం చేస్తే విధించే జరిమానాను ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) భారీగా పెంచింది. శబ్దకాలుష్యానికి పాల్పడిన వారికి రూ. లక్ష జరిమానా విధించనుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు జరిమానాను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత నివాసాల వద్ద కానీ , వాణిజ్య సముదాయాల వద్ద కానీ టపాసులు కాల్చినట్లయితే రూ. వెయ్యి రూపాయాలు, సైలెంట్ జోన్స్ వద్ద పేలిస్తే రూ. 3 వేల జరిమానా విధించనుంది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన కార్యకలాపాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాలు, వాణిజ్య సముదాయాల వద్ద టపాసులు కాల్చితే రూ. 10 వేలు, సెలైంట్జోన్లలో అయితే రూ. 20 వేలు ఫైన్ వసూలు చేయుంది.
ఒక వేళ ఇదే తప్పును రెండో సారి చేస్తే రూ. 40 వేలు ఫైన్ పడనుంది. రెండు సార్లు కన్నా ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రాకర్లు పేల్చితే లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. అదననంగా, జనరేటర్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు డిపిసిసి పలు చర్యలు తీసుకుంది. లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
This post was last modified on July 11, 2021 3:02 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…