Trends

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. అక్టోబర్ లో థర్డ్ వేవ్..!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ‌త 50 రోజుల నుంచి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు.. గ‌త 24 గంట‌ల్లో పెర‌గ‌డం క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఈ క్ర‌మంలో నేష‌న‌ల్ కోవిడ్‌-19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ వ్యాఖ్య‌లు కాస్త ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి.

అక్టోబర్-నవంబర్ మధ్య మళ్లీ కేసులు విజృంభించే అవ‌కాశం ఉందంటోంది క‌మిటీ. కానీ.. సెకెండ్ వేవ్ అంత స్థాయిలో కేసులు రికార్డ్ కాక‌పోవ‌చ్చ‌ని చెబుతోంది. రెండో వేవ్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. థ‌ర్డ్ వేవ్ వ‌స్తే మాత్రం ల‌క్ష‌న్న‌రకు మించి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది.

ఆగస్టు 20 నాటికి రోజువారీ కేసులు 20వేల‌కు త‌గ్గిపోవ‌చ్చని అంటోంది నేష‌న‌ల్ కోవిడ్‌-19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ. అయితే అక్టోబ‌ర్ 9 నుంచి నవంబర్ 28 మధ్యలో థ‌ర్డ్ వేవ్ కేసులు అధికంగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటోంది. టీకా డ్రైవ్ వేగవంతంగా కొన‌సాగితే.. సెకెండ్ వేవ్ అంత ప్ర‌మాదం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటోంది.

ప్ర‌స్తుతం డెల్టా ప్ల‌స్ కేసులు దేశ‌వ్యాప్తంగా బ‌య‌ట‌ప‌డుతుండ‌డం.. కేసులు పెరుగుతుండ‌డం చూస్తుంటే.. త్వ‌ర‌లో థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌ప్పేలా లేద‌ని అంటున్నారు నిపుణులు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు.

This post was last modified on July 8, 2021 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

1 hour ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

3 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago