Trends

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. అక్టోబర్ లో థర్డ్ వేవ్..!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ‌త 50 రోజుల నుంచి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న కేసులు.. గ‌త 24 గంట‌ల్లో పెర‌గ‌డం క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఈ క్ర‌మంలో నేష‌న‌ల్ కోవిడ్‌-19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ వ్యాఖ్య‌లు కాస్త ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి.

అక్టోబర్-నవంబర్ మధ్య మళ్లీ కేసులు విజృంభించే అవ‌కాశం ఉందంటోంది క‌మిటీ. కానీ.. సెకెండ్ వేవ్ అంత స్థాయిలో కేసులు రికార్డ్ కాక‌పోవ‌చ్చ‌ని చెబుతోంది. రెండో వేవ్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. థ‌ర్డ్ వేవ్ వ‌స్తే మాత్రం ల‌క్ష‌న్న‌రకు మించి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది.

ఆగస్టు 20 నాటికి రోజువారీ కేసులు 20వేల‌కు త‌గ్గిపోవ‌చ్చని అంటోంది నేష‌న‌ల్ కోవిడ్‌-19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ. అయితే అక్టోబ‌ర్ 9 నుంచి నవంబర్ 28 మధ్యలో థ‌ర్డ్ వేవ్ కేసులు అధికంగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటోంది. టీకా డ్రైవ్ వేగవంతంగా కొన‌సాగితే.. సెకెండ్ వేవ్ అంత ప్ర‌మాదం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటోంది.

ప్ర‌స్తుతం డెల్టా ప్ల‌స్ కేసులు దేశ‌వ్యాప్తంగా బ‌య‌ట‌ప‌డుతుండ‌డం.. కేసులు పెరుగుతుండ‌డం చూస్తుంటే.. త్వ‌ర‌లో థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌ప్పేలా లేద‌ని అంటున్నారు నిపుణులు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

8 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

37 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago