దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత 50 రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న కేసులు.. గత 24 గంటల్లో పెరగడం కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ వ్యాఖ్యలు కాస్త ఆందోళనను కలిగిస్తున్నాయి.
అక్టోబర్-నవంబర్ మధ్య మళ్లీ కేసులు విజృంభించే అవకాశం ఉందంటోంది కమిటీ. కానీ.. సెకెండ్ వేవ్ అంత స్థాయిలో కేసులు రికార్డ్ కాకపోవచ్చని చెబుతోంది. రెండో వేవ్ పీక్స్ లో ఉన్న సమయంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే మాత్రం లక్షన్నరకు మించి ఉండకపోవచ్చని అంచనా వేసింది.
ఆగస్టు 20 నాటికి రోజువారీ కేసులు 20వేలకు తగ్గిపోవచ్చని అంటోంది నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ. అయితే అక్టోబర్ 9 నుంచి నవంబర్ 28 మధ్యలో థర్డ్ వేవ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంటోంది. టీకా డ్రైవ్ వేగవంతంగా కొనసాగితే.. సెకెండ్ వేవ్ అంత ప్రమాదం ఉండకపోవచ్చని అంటోంది.
ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా బయటపడుతుండడం.. కేసులు పెరుగుతుండడం చూస్తుంటే.. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదని అంటున్నారు నిపుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
This post was last modified on July 8, 2021 2:43 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…