దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. దీంతో.. థర్డ్ వేవ్ రావడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత 50 రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న కేసులు.. గత 24 గంటల్లో పెరగడం కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ వ్యాఖ్యలు కాస్త ఆందోళనను కలిగిస్తున్నాయి.
అక్టోబర్-నవంబర్ మధ్య మళ్లీ కేసులు విజృంభించే అవకాశం ఉందంటోంది కమిటీ. కానీ.. సెకెండ్ వేవ్ అంత స్థాయిలో కేసులు రికార్డ్ కాకపోవచ్చని చెబుతోంది. రెండో వేవ్ పీక్స్ లో ఉన్న సమయంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే మాత్రం లక్షన్నరకు మించి ఉండకపోవచ్చని అంచనా వేసింది.
ఆగస్టు 20 నాటికి రోజువారీ కేసులు 20వేలకు తగ్గిపోవచ్చని అంటోంది నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ. అయితే అక్టోబర్ 9 నుంచి నవంబర్ 28 మధ్యలో థర్డ్ వేవ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంటోంది. టీకా డ్రైవ్ వేగవంతంగా కొనసాగితే.. సెకెండ్ వేవ్ అంత ప్రమాదం ఉండకపోవచ్చని అంటోంది.
ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా బయటపడుతుండడం.. కేసులు పెరుగుతుండడం చూస్తుంటే.. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదని అంటున్నారు నిపుణులు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
This post was last modified on July 8, 2021 2:43 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…