ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఉంది.
మ్యాచ్ ఆడితే ఫీజు దక్కకపోగా.. సొంతంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకుని మ్యాచ్లకు వెళ్లే రోజుల నుంచి ఇప్పుడు బీసీసీఐ పరిధిలోకి చేరడమే కాక లక్షల్లో మ్యాచ్ ఫీజులు అందుకోవడం, కోట్లమంది తమ ఆట చూసేలా ఎదిగిన భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఆమెది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎన్నో అద్భుత రికార్డులను ఆమె సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా ఆమె గొప్ప గౌరవాన్ని అందుకుంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లట్ ఎడ్వర్డ్స్ ఇప్పటిదాకా మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతూ వచ్చింది. 10,273 పరుగులతో ఆమె పేరిట ఉన్న రికార్డును శనివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మిథాలీ బద్దలు కొట్టింది. 23వ ఓవర్లో బౌండరీ ద్వారా ఆమె మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అయింది. ఈ మ్యాచ్ అయ్యేసరికి ఆమె మొత్తం పరుగులు 10,337కు చేరుకున్నాయి. 11 టెస్టుల్లో 669 పరుగులు చేసిన మిథాలీ.. 217 వన్డేల్లో 7304 పరుగులు సాధించింది.
ఇక టీ20 ఫార్మాట్లో 88 మ్యాచ్లాడిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2364 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్నందించడం ద్వారా చిరస్మరణీయం చేసుకుంది. భారత్ ముందు 220 పరుగుల లక్ష్యం నిలవగా.. మిథాలీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఆమె పట్టుదలతో క్రీజులో నిలిచి భారత్కు విజయాన్నందించింది. 22 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ అలసిపోకుండా.. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత పోరాట స్ఫూర్తితో ఆటలో కొనసాగుతుండటం అద్భుతమే.
This post was last modified on July 4, 2021 10:59 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…