ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఉంది.
మ్యాచ్ ఆడితే ఫీజు దక్కకపోగా.. సొంతంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకుని మ్యాచ్లకు వెళ్లే రోజుల నుంచి ఇప్పుడు బీసీసీఐ పరిధిలోకి చేరడమే కాక లక్షల్లో మ్యాచ్ ఫీజులు అందుకోవడం, కోట్లమంది తమ ఆట చూసేలా ఎదిగిన భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఆమెది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎన్నో అద్భుత రికార్డులను ఆమె సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా ఆమె గొప్ప గౌరవాన్ని అందుకుంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లట్ ఎడ్వర్డ్స్ ఇప్పటిదాకా మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతూ వచ్చింది. 10,273 పరుగులతో ఆమె పేరిట ఉన్న రికార్డును శనివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మిథాలీ బద్దలు కొట్టింది. 23వ ఓవర్లో బౌండరీ ద్వారా ఆమె మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అయింది. ఈ మ్యాచ్ అయ్యేసరికి ఆమె మొత్తం పరుగులు 10,337కు చేరుకున్నాయి. 11 టెస్టుల్లో 669 పరుగులు చేసిన మిథాలీ.. 217 వన్డేల్లో 7304 పరుగులు సాధించింది.
ఇక టీ20 ఫార్మాట్లో 88 మ్యాచ్లాడిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2364 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్నందించడం ద్వారా చిరస్మరణీయం చేసుకుంది. భారత్ ముందు 220 పరుగుల లక్ష్యం నిలవగా.. మిథాలీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఆమె పట్టుదలతో క్రీజులో నిలిచి భారత్కు విజయాన్నందించింది. 22 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ అలసిపోకుండా.. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత పోరాట స్ఫూర్తితో ఆటలో కొనసాగుతుండటం అద్భుతమే.
This post was last modified on July 4, 2021 10:59 am
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…