ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఉంది.
మ్యాచ్ ఆడితే ఫీజు దక్కకపోగా.. సొంతంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకుని మ్యాచ్లకు వెళ్లే రోజుల నుంచి ఇప్పుడు బీసీసీఐ పరిధిలోకి చేరడమే కాక లక్షల్లో మ్యాచ్ ఫీజులు అందుకోవడం, కోట్లమంది తమ ఆట చూసేలా ఎదిగిన భారత మహిళల క్రికెట్ ప్రయాణంలో ఆమెది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎన్నో అద్భుత రికార్డులను ఆమె సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా ఆమె గొప్ప గౌరవాన్ని అందుకుంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లట్ ఎడ్వర్డ్స్ ఇప్పటిదాకా మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతూ వచ్చింది. 10,273 పరుగులతో ఆమె పేరిట ఉన్న రికార్డును శనివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మిథాలీ బద్దలు కొట్టింది. 23వ ఓవర్లో బౌండరీ ద్వారా ఆమె మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అయింది. ఈ మ్యాచ్ అయ్యేసరికి ఆమె మొత్తం పరుగులు 10,337కు చేరుకున్నాయి. 11 టెస్టుల్లో 669 పరుగులు చేసిన మిథాలీ.. 217 వన్డేల్లో 7304 పరుగులు సాధించింది.
ఇక టీ20 ఫార్మాట్లో 88 మ్యాచ్లాడిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2364 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్నందించడం ద్వారా చిరస్మరణీయం చేసుకుంది. భారత్ ముందు 220 పరుగుల లక్ష్యం నిలవగా.. మిథాలీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఆమె పట్టుదలతో క్రీజులో నిలిచి భారత్కు విజయాన్నందించింది. 22 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ అలసిపోకుండా.. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత పోరాట స్ఫూర్తితో ఆటలో కొనసాగుతుండటం అద్భుతమే.
This post was last modified on July 4, 2021 10:59 am
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…