ఇన్ స్టాగ్రామ్.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు దీనిని ఇప్పుడు తెగ వాడేస్తున్నారు. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొందరు సెలబ్రెటీలు కోట్లు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా..?
ఇన్ స్టా ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల జాబితాను ప్రతీ ఏడాది హెచ్ పర్ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి జాబితానే విడుదల చేసింది. దాని ప్రకారం.. ఏయే సెలబ్రెటీలు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఒక్క పోస్ట్ తో 6లక్షల 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.08 కోట్లు అన్నమాట. మొత్తం జాబితాలో కోహ్లీకి 19వ స్థానం దక్కింది. టాప్ 20లో నిలిచిన ఏకైక భారత సెలెబ్రిటీ కోహ్లీ మాత్రమే.
ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా..27 వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో ఒక్కో పోస్ట్ కు రూ.3 కోట్ల వరకు రాబడుతోంది. మొత్తం 395 మంది సెలెబ్రిటీలు ఉన్న ఈ లిస్టులో ఇద్దరు భారతీయులకే చోటు దక్కింది.
ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదిస్తున్న నెంబర్ వన్ సెలెబ్రిటీ ఎవరంటే… ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక్కో పోస్ట్ కు రూ.11.9 కోట్లు వెనకేసుకుంటున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.
This post was last modified on July 3, 2021 10:56 am
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…