Trends

ఇన్ స్టా లో సింగిల్ పోస్టు.. కోట్లలో ఆదాయం..!

ఇన్ స్టాగ్రామ్.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు దీనిని ఇప్పుడు తెగ వాడేస్తున్నారు. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొందరు సెలబ్రెటీలు కోట్లు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా..?

ఇన్ స్టా ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల జాబితాను ప్రతీ ఏడాది హెచ్‌ పర్‌ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి జాబితానే విడుదల చేసింది. దాని ప్రకారం.. ఏయే సెలబ్రెటీలు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఒక్క పోస్ట్ తో 6లక్షల 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.08 కోట్లు అన్నమాట. మొత్తం జాబితాలో కోహ్లీకి 19వ స్థానం దక్కింది. టాప్ 20లో నిలిచిన ఏకైక భారత సెలెబ్రిటీ కోహ్లీ మాత్రమే.

ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా..27 వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో ఒక్కో పోస్ట్ కు రూ.3 కోట్ల వరకు రాబడుతోంది. మొత్తం 395 మంది సెలెబ్రిటీలు ఉన్న ఈ లిస్టులో ఇద్దరు భారతీయులకే చోటు దక్కింది.

ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదిస్తున్న నెంబర్ వన్ సెలెబ్రిటీ ఎవరంటే… ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక్కో పోస్ట్ కు రూ.11.9 కోట్లు వెనకేసుకుంటున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.

This post was last modified on July 3, 2021 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

1 minute ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

25 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago