ఇన్ స్టాగ్రామ్.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు దీనిని ఇప్పుడు తెగ వాడేస్తున్నారు. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొందరు సెలబ్రెటీలు కోట్లు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా..?
ఇన్ స్టా ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల జాబితాను ప్రతీ ఏడాది హెచ్ పర్ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి జాబితానే విడుదల చేసింది. దాని ప్రకారం.. ఏయే సెలబ్రెటీలు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఒక్క పోస్ట్ తో 6లక్షల 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.08 కోట్లు అన్నమాట. మొత్తం జాబితాలో కోహ్లీకి 19వ స్థానం దక్కింది. టాప్ 20లో నిలిచిన ఏకైక భారత సెలెబ్రిటీ కోహ్లీ మాత్రమే.
ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా..27 వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో ఒక్కో పోస్ట్ కు రూ.3 కోట్ల వరకు రాబడుతోంది. మొత్తం 395 మంది సెలెబ్రిటీలు ఉన్న ఈ లిస్టులో ఇద్దరు భారతీయులకే చోటు దక్కింది.
ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదిస్తున్న నెంబర్ వన్ సెలెబ్రిటీ ఎవరంటే… ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఇతను ఒక్కో పోస్ట్ కు రూ.11.9 కోట్లు వెనకేసుకుంటున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…