కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ అయితే.. మరింత అతలాకుతలం చేసేసింది. యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా.. త్వరలోనే థర్డ్ వేవ్ కూడా రానుందని… అది ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపించనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. దీనిపై ఐసీఎంఆర్ నివేదిక విడుదల చేసింది.
థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేసినా.. ఐసీఎంఆర్ మాత్రం ఛాన్స్ లేదని అంటోంది. ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెబుతోంది.
ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు… కేవలం పిల్లలపైనే ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
సెకెండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగితే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం SARS-CoV-2 ట్రాన్స్మిషన్ యొక్క కంపార్ట్మెంటల్ మోడల్ ఉపయోగించి.. మూడో వేవ్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశోధకులు.
This post was last modified on June 28, 2021 11:17 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…