కరోనా డెల్టా వేరియంట్… సెకండ్ వేవ్ లో భారత్ లో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనగా.. డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. దేశంలో.. ఇప్పుడిప్పుడే ఈ డెల్టా ప్లస్ వేరింయట్ కేసులు నమోదౌతున్నాయి. ఇటీవల ఓ మరణం కూడా సంభవించింది. కాగా.. తాజాగా ఏపీలోనూ తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధృవీకరించారు. కొన్ని రోజుల ముందే తిరుపతిలో ఓ వ్యక్తికి డెల్టా ప్లస్ వైరస్ రకం సోకిందని, అయితే తను ఇప్పటికే కోలుకున్నాడన్నారు. ఆయన నుండి ఎవరికీ వైరస్ సోకలేదని మంత్రి ప్రకటించారు.
డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి ఆళ్ల నాని… థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. కరోనా వైరస్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని సమీక్షలో సీఎం సూచించారని, బ్లాక్ ఫంగస్ కేసులకు కూడా చికిత్సలు కొనసాగుతున్నాయన్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…