కరోనా డెల్టా వేరియంట్… సెకండ్ వేవ్ లో భారత్ లో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనగా.. డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించడం మొదలుపెట్టింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు. దేశంలో.. ఇప్పుడిప్పుడే ఈ డెల్టా ప్లస్ వేరింయట్ కేసులు నమోదౌతున్నాయి. ఇటీవల ఓ మరణం కూడా సంభవించింది. కాగా.. తాజాగా ఏపీలోనూ తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధృవీకరించారు. కొన్ని రోజుల ముందే తిరుపతిలో ఓ వ్యక్తికి డెల్టా ప్లస్ వైరస్ రకం సోకిందని, అయితే తను ఇప్పటికే కోలుకున్నాడన్నారు. ఆయన నుండి ఎవరికీ వైరస్ సోకలేదని మంత్రి ప్రకటించారు.
డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి ఆళ్ల నాని… థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. కరోనా వైరస్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని సమీక్షలో సీఎం సూచించారని, బ్లాక్ ఫంగస్ కేసులకు కూడా చికిత్సలు కొనసాగుతున్నాయన్నారు.
This post was last modified on June 25, 2021 6:54 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…