టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి క్రేజ్ చాలా ఎక్కువ. ఆయన ఏది చేసినా.. అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఆయన.. ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. ఆ ఐపీఎల్ కూడా..కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో.. ధోనీ తాత్కాలికంగా క్రికెట్ కి దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో.. అభిమానులను ఖుషీ చేయడానికి ధోనీ తాజాగా.. తన ఫోటోలను విడుదల చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం కేటాయిస్తున్న ధోనీ.. తాజాగా.. తన కూతురు జీవాతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ ఫోటోలో ధోనీ మీసం తిప్పి కనిపించడం గమనార్హం. ఈ ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ధోనీ లుక్ అదిరిపోయిందటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తమిళ సూపర్ స్టార్ అజిత్.. కూతురు సెంటిమెంట్ తో నటించిన జగమల్ల సినిమాలోని కన్నానే కన్నే సినిమాలోని పాటను ఈ ఫోటోకి క్యాప్షన్ గా పెట్టడం గమనార్హం. ఇక కొందరైతే విక్రమార్కుడు లో రవితేజ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ధోనీ మైదానంలో కనపడకున్నా.. ఇలా ఫోటోలు షేర్ చేసినందుకు అభిమానులు ఆనంద పడుతున్నారు.
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…