టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి క్రేజ్ చాలా ఎక్కువ. ఆయన ఏది చేసినా.. అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ఆయన.. ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. ఆ ఐపీఎల్ కూడా..కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో.. ధోనీ తాత్కాలికంగా క్రికెట్ కి దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో.. అభిమానులను ఖుషీ చేయడానికి ధోనీ తాజాగా.. తన ఫోటోలను విడుదల చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం కేటాయిస్తున్న ధోనీ.. తాజాగా.. తన కూతురు జీవాతో కలిసి సిమ్లా టూర్ కి వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ ఫోటోలో ధోనీ మీసం తిప్పి కనిపించడం గమనార్హం. ఈ ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ధోనీ లుక్ అదిరిపోయిందటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తమిళ సూపర్ స్టార్ అజిత్.. కూతురు సెంటిమెంట్ తో నటించిన జగమల్ల సినిమాలోని కన్నానే కన్నే సినిమాలోని పాటను ఈ ఫోటోకి క్యాప్షన్ గా పెట్టడం గమనార్హం. ఇక కొందరైతే విక్రమార్కుడు లో రవితేజ లా ఉన్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ధోనీ మైదానంలో కనపడకున్నా.. ఇలా ఫోటోలు షేర్ చేసినందుకు అభిమానులు ఆనంద పడుతున్నారు.
This post was last modified on June 22, 2021 11:33 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…