కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వివాహితను.. కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జరిపాడు అ అధికారి. అయితే అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని.. తరచూ వేధిస్తున్నాడు. ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతానని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
చివరికి అతని ఆగడాలు భరించలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చేసుకుని తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను తీసుకుని ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో పెను దుమారం రేపుతోంది. మహిళను రక్షించాల్సిన పోలీసులే.. కీచకులుగా మారిపోవడం ఏమిటంటూ ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…
అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత…