కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వివాహితను.. కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జరిపాడు అ అధికారి. అయితే అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని.. తరచూ వేధిస్తున్నాడు. ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతానని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
చివరికి అతని ఆగడాలు భరించలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చేసుకుని తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను తీసుకుని ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో పెను దుమారం రేపుతోంది. మహిళను రక్షించాల్సిన పోలీసులే.. కీచకులుగా మారిపోవడం ఏమిటంటూ ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
This post was last modified on June 17, 2021 10:25 am
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…
టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…