కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వివాహితను.. కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జరిపాడు అ అధికారి. అయితే అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని.. తరచూ వేధిస్తున్నాడు. ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతానని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
చివరికి అతని ఆగడాలు భరించలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చేసుకుని తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను తీసుకుని ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో పెను దుమారం రేపుతోంది. మహిళను రక్షించాల్సిన పోలీసులే.. కీచకులుగా మారిపోవడం ఏమిటంటూ ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
This post was last modified on June 17, 2021 10:25 am
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…