కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వివాహితను.. కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జరిపాడు అ అధికారి. అయితే అదే సమయంలో ఆమె నగ్న చిత్రాలను తీసుకుని.. తరచూ వేధిస్తున్నాడు. ఎవరికైనా చెప్తే వాటిని బయటపెడతానని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
చివరికి అతని ఆగడాలు భరించలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మాస్క్ ధరించలేదన్న కారణాన్ని సాకుగా చేసుకుని తనపై అత్యాచారం జరిపాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోటోలను తీసుకుని ఇప్పటికీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఇప్పుడు గుజరాత్లో పెను దుమారం రేపుతోంది. మహిళను రక్షించాల్సిన పోలీసులే.. కీచకులుగా మారిపోవడం ఏమిటంటూ ప్రజా, మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
This post was last modified on June 17, 2021 10:25 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…