Trends

నిజాం మునిముని మనమరాలు.. చేస్తుంది తెలిస్తే వావ్ అంటారు

నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసుకునే వేళలో రాజుగా వ్యవహరిస్తున్న చివరి నిజాం (మీర్ ఉస్మాన్ అలీఖాన్) ఉన్నారు కదా. ఆయన ముని ముని మనమరాలు. అదెలా అంటారా? మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొడుకు మోజం జాహ్. అమీర్ పేట నుంచి దిల్ షుఖ్ నగర్ వెళ్లేటప్పుడు అబిడ్స్ మీదుగా వెళుతున్నప్పు వచ్చే మోజంజాహ్ మార్కెట్ ఉంది కదా? అది ఆయన పేరు మీదనే ఏర్పాటు చేశారు.

ఆయన కుమార్తె ఫాతిమా ఫాజియా. ఆమెకు ఒక కొడుకు పేరు హిమాయత్ మీర్జా. అతడి కుమార్తె జెహ్రా. ఇప్పుడు చెప్పబోతుంది ఆమె గురించే. అంటే చివరి నిజాంకు జెహ్రా ముని ముని మనమరాలు. అమెరికా.. కెనడాలో చదువుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆమెకు చిన్నతనం నుంచే పెయింటింగ్ అంటే మహా ఇష్టం. చాలా పెయింటింగ్స్ వేసి దాచుకున్నది.

కరోనా విలయతాండవంలో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి చలించింది. తన వరకు తాను ఏమైనా చేయాలన్న సంకల్పంతో చివరకు తాను గీసిన పెయింటింగ్స్ ను వేలానికి పెట్టింది. అలా ఇప్పటివరకు రూ.15 లక్షలు వచ్చాయి. వాటితో ఆమె పలువురికి సాయం అందిస్తున్నారు. పెయింటింగ్స్ వేలం వేస్తే వచ్చే డబ్బుల్ని పలు ఆసుపత్రులకు.. చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తున్నారు. వయసు చిన్నదే అయినా.. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలన్న మనసు పెద్దది.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

2 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

2 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

4 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

4 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

4 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

5 hours ago