నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసుకునే వేళలో రాజుగా వ్యవహరిస్తున్న చివరి నిజాం (మీర్ ఉస్మాన్ అలీఖాన్) ఉన్నారు కదా. ఆయన ముని ముని మనమరాలు. అదెలా అంటారా? మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొడుకు మోజం జాహ్. అమీర్ పేట నుంచి దిల్ షుఖ్ నగర్ వెళ్లేటప్పుడు అబిడ్స్ మీదుగా వెళుతున్నప్పు వచ్చే మోజంజాహ్ మార్కెట్ ఉంది కదా? అది ఆయన పేరు మీదనే ఏర్పాటు చేశారు.
ఆయన కుమార్తె ఫాతిమా ఫాజియా. ఆమెకు ఒక కొడుకు పేరు హిమాయత్ మీర్జా. అతడి కుమార్తె జెహ్రా. ఇప్పుడు చెప్పబోతుంది ఆమె గురించే. అంటే చివరి నిజాంకు జెహ్రా ముని ముని మనమరాలు. అమెరికా.. కెనడాలో చదువుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆమెకు చిన్నతనం నుంచే పెయింటింగ్ అంటే మహా ఇష్టం. చాలా పెయింటింగ్స్ వేసి దాచుకున్నది.
కరోనా విలయతాండవంలో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి చలించింది. తన వరకు తాను ఏమైనా చేయాలన్న సంకల్పంతో చివరకు తాను గీసిన పెయింటింగ్స్ ను వేలానికి పెట్టింది. అలా ఇప్పటివరకు రూ.15 లక్షలు వచ్చాయి. వాటితో ఆమె పలువురికి సాయం అందిస్తున్నారు. పెయింటింగ్స్ వేలం వేస్తే వచ్చే డబ్బుల్ని పలు ఆసుపత్రులకు.. చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తున్నారు. వయసు చిన్నదే అయినా.. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలన్న మనసు పెద్దది.
This post was last modified on June 4, 2021 1:47 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…