ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా.. మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకువస్తోంది.
ఇప్పటి వరకు మనం వాట్సాప్ లో ఎవరితోనైనా ఛాటింగ్ చేసిన తర్వాత.. ఆ మెసేజ్ లు వద్దు అనుకుంటూ.. ఒక్కో మెసేజ్ అయినా చదవాలి. లేదంటే.. అన్నీ కలిపి ఒకేసారి డిలీట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఇక నుంచి స్పెషల్ గా మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన పనిలేదు. దాని కోసమే స్పెషల్లీ ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తోంది.
మెసేజ్లను డిలీట్ చేసుకునే అవసరం లేకుండా చూడగానే వాటికవే డిలీట్ అయ్యేలా ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై యాజమాన్య సంస్థ ఫేస్బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికి ఈ ఫీచర్ స్నాప్చాట్ సహా కొన్ని ప్లాట్ఫాంల్లో అందుబాటులో ఉంది.
కాగా వాట్సాప్లో చాట్ అనంతరం మెసేజ్లు డిలీట్ చేసుకోవడం కష్టమవుతుందనే ఫిర్యాదు యూజర్ల నుంచి ఎప్పటి నుంచో వస్తోంది. ఈ డిమాండ్ ఆధారంగానే తాజా ఫీచర్ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్ను కంప్లీట్ గా కాకుండా మనకు ఏ కాంటాక్ట్ కి అవసరమైతే.. వారికి పెట్టుకునే వీలు ఉంటుంది. మనం ఎవరి మెసేజ్ లు అయితే.. డిలీట్ చేయాలి అనుకుంటామో.. వారికి ఈ ఫీచర్ పెట్టుకుంటే సరిపోతుంది. బిజినెస్ యూజర్లు ఈ న్యూ ఫీచర్ ఎంతో ఉపయోగకరం కానుంది.
This post was last modified on June 4, 2021 9:11 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…