Trends

వాట్సాప్ న్యూ ఫీచర్.. స్పెషల్ గా డిలీట్ చేయక్కర్లేదు..!

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా.. మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకువస్తోంది.

ఇప్పటి వరకు మనం వాట్సాప్ లో ఎవరితోనైనా ఛాటింగ్ చేసిన తర్వాత.. ఆ మెసేజ్ లు వద్దు అనుకుంటూ.. ఒక్కో మెసేజ్ అయినా చదవాలి. లేదంటే.. అన్నీ కలిపి ఒకేసారి డిలీట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఇక నుంచి స్పెషల్ గా మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన పనిలేదు. దాని కోసమే స్పెషల్లీ ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

మెసేజ్‌లను డిలీట్ చేసుకునే అవసరం లేకుండా చూడగానే వాటికవే డిలీట్ అయ్యేలా ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికి ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌ సహా కొన్ని ప్లాట్‌ఫాంల్లో అందుబాటులో ఉంది.

కాగా వాట్సాప్‌లో చాట్ అనంతరం మెసేజ్లు డిలీట్ చేసుకోవడం కష్టమవుతుందనే ఫిర్యాదు యూజర్ల నుంచి ఎప్పటి నుంచో వస్తోంది. ఈ డిమాండ్ ఆధారంగానే తాజా ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్‌ను కంప్లీట్ గా కాకుండా మనకు ఏ కాంటాక్ట్ కి అవసరమైతే.. వారికి పెట్టుకునే వీలు ఉంటుంది. మనం ఎవరి మెసేజ్ లు అయితే.. డిలీట్ చేయాలి అనుకుంటామో.. వారికి ఈ ఫీచర్ పెట్టుకుంటే సరిపోతుంది. బిజినెస్ యూజర్లు ఈ న్యూ ఫీచర్ ఎంతో ఉపయోగకరం కానుంది.

This post was last modified on June 4, 2021 9:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

17 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

21 minutes ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

3 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

4 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

6 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

7 hours ago