Trends

కరోనా : కోడలిపై అత్త శాడిజం..!

అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ బాగానే తెలుసు. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. విమర్శించుకోవడాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అత్త ఏం చెప్పినా.. కోడలికి నచ్చదు.. కోడలు ఏ పని చేసినా.. అత్త మెచ్చదు. ఇవన్నీ.. సాధారణనంగా అందరు ఇళ్లల్లో ఉండేవే. అయితే.. ఈ అత్తా-కోడళ్లు అంతకు మించి.

కరోనా సోకిన అత్తకు దూరంగా ఉందని.. సదరు అత్తగారు.. కోడలిపై తన శాడిజం చూపించింది. కావాలని కోడలికి కూడా కరోనా సోకేలా చేసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆమె భర్త ఏడు నెలల క్రితం పని నిమిత్తం ఒడిశా వెళ్లాడు. అత్త, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే.. అనుకోకుండా.. అత్తకు కరోనా పాజటివ్ గా తేలింది.

కరోనా అంటువ్యాధి కావడంతో.. కోడలు ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఆహారం కూడా దూరంనుంచే పెడుతోంది. పిల్లలను కూడా ఆమె వద్దకు వెళ్లనివ్వడం లేదు. దీంతో.. అత్తగారి ఇగో హర్ట్ అయ్యింది. తాను చచ్చిపోవాలని కోడలు కోరుకుంటోందని భావించింది.

తనకు సోకిన కరోనా కోడలికి కూడా సోకాలని అనుకుంది. అంతే..బలవంతంగా కోడలిని హగ్ చేసుకుంది. రెండు రోజుల్లో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పి.. కోడలిని ఇంటి నుంచి గెంటేసింది.

సదరు కోడలు తన సోదరి సహాయంతో పుట్టింటికి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఆమె.. ఇటీవల వీడియో కాల్ ద్వారా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నారు.

This post was last modified on June 3, 2021 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

12 minutes ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

3 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

5 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago