Trends

కరోనా : కోడలిపై అత్త శాడిజం..!

అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ బాగానే తెలుసు. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. విమర్శించుకోవడాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అత్త ఏం చెప్పినా.. కోడలికి నచ్చదు.. కోడలు ఏ పని చేసినా.. అత్త మెచ్చదు. ఇవన్నీ.. సాధారణనంగా అందరు ఇళ్లల్లో ఉండేవే. అయితే.. ఈ అత్తా-కోడళ్లు అంతకు మించి.

కరోనా సోకిన అత్తకు దూరంగా ఉందని.. సదరు అత్తగారు.. కోడలిపై తన శాడిజం చూపించింది. కావాలని కోడలికి కూడా కరోనా సోకేలా చేసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆమె భర్త ఏడు నెలల క్రితం పని నిమిత్తం ఒడిశా వెళ్లాడు. అత్త, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే.. అనుకోకుండా.. అత్తకు కరోనా పాజటివ్ గా తేలింది.

కరోనా అంటువ్యాధి కావడంతో.. కోడలు ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఆహారం కూడా దూరంనుంచే పెడుతోంది. పిల్లలను కూడా ఆమె వద్దకు వెళ్లనివ్వడం లేదు. దీంతో.. అత్తగారి ఇగో హర్ట్ అయ్యింది. తాను చచ్చిపోవాలని కోడలు కోరుకుంటోందని భావించింది.

తనకు సోకిన కరోనా కోడలికి కూడా సోకాలని అనుకుంది. అంతే..బలవంతంగా కోడలిని హగ్ చేసుకుంది. రెండు రోజుల్లో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పి.. కోడలిని ఇంటి నుంచి గెంటేసింది.

సదరు కోడలు తన సోదరి సహాయంతో పుట్టింటికి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఆమె.. ఇటీవల వీడియో కాల్ ద్వారా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నారు.

This post was last modified on June 3, 2021 10:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago