అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ బాగానే తెలుసు. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. విమర్శించుకోవడాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అత్త ఏం చెప్పినా.. కోడలికి నచ్చదు.. కోడలు ఏ పని చేసినా.. అత్త మెచ్చదు. ఇవన్నీ.. సాధారణనంగా అందరు ఇళ్లల్లో ఉండేవే. అయితే.. ఈ అత్తా-కోడళ్లు అంతకు మించి.
కరోనా సోకిన అత్తకు దూరంగా ఉందని.. సదరు అత్తగారు.. కోడలిపై తన శాడిజం చూపించింది. కావాలని కోడలికి కూడా కరోనా సోకేలా చేసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆమె భర్త ఏడు నెలల క్రితం పని నిమిత్తం ఒడిశా వెళ్లాడు. అత్త, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే.. అనుకోకుండా.. అత్తకు కరోనా పాజటివ్ గా తేలింది.
కరోనా అంటువ్యాధి కావడంతో.. కోడలు ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఆహారం కూడా దూరంనుంచే పెడుతోంది. పిల్లలను కూడా ఆమె వద్దకు వెళ్లనివ్వడం లేదు. దీంతో.. అత్తగారి ఇగో హర్ట్ అయ్యింది. తాను చచ్చిపోవాలని కోడలు కోరుకుంటోందని భావించింది.
తనకు సోకిన కరోనా కోడలికి కూడా సోకాలని అనుకుంది. అంతే..బలవంతంగా కోడలిని హగ్ చేసుకుంది. రెండు రోజుల్లో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పి.. కోడలిని ఇంటి నుంచి గెంటేసింది.
సదరు కోడలు తన సోదరి సహాయంతో పుట్టింటికి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఆమె.. ఇటీవల వీడియో కాల్ ద్వారా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…