వాట్సాప్ … సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా దుమ్మురేపుతున్న యాప్. ఇది వచ్చాక.. అసలు ఇలాంటి సర్వీసు ఒకటి లేకుండా ఇంతకాలం ఎలా బతికాంరా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఒక సమాచారాన్ని టెక్ట్స్, ఫొటో, వీడియో రూపంలో క్షణాల్లో పంపగలిన ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఒక ఇండియన్ స్టార్టప్ కంపెనీ ఒక సంచలన సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారికి చేసుకునే పరీక్ష. ప్రస్తుతం కరోనా నిర్ధారణకు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. ఒకటి రాపిడ్ మరొకటి ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్లో ఎక్కువ ఖచ్చితత్వం ఉంది. అయితే, ఇందులోని ఓ సమస్యను వాట్సాప్ ద్వారా పరిష్కరించారు.
కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన తర్వాత సీటీ స్కానింగ్ చేస్తుంటారు. అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కూడా స్కానింగ్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు సీటీ స్కానింగ్తో రేడియేషన్ భయం కూడా ఉంది. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి కూడా చికిత్స సకాలంలో అందడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్, సీటీస్కానింగ్ సదుపాయాలు తక్కువ. వీటన్నింటికీ పరిష్కారంగా ఎక్స్రేను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసే సాంకేతికతను బెంగళూరుకు చెందిన ఆర్ట్కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని తయారుచేసిన కంపెనీకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ. 230 కోట్ల ఆర్థిక సాయం చేయడం గమనార్హం.
ఈ టెక్నాలజీని ‘ఎక్స్రేసేతు’ అని పిలుస్తున్నారు. వైద్యులు ఎక్స్రేల ఫొటోలను వాట్సాప్ ద్వారా www. xraysetu.com వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. ఇది కొవిడ్తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను గుర్తించగలదు. ఇండియాలో 1000 మందికిపైగా కరోనా రోగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు.
ఈ పరీక్ష చేసుకునేందుకు అనుసరించాల్సిన విధానం
స్టెప్ 1 – www. xraysetu.com లోకి వెళ్లి ఎక్స్రేసేతు బీటా బటన్పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2 – వాట్సాప్ చాట్బాక్స్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3 – వైద్యుడు +91 80461638638 నంబర్కు వాట్సాప్ చేయాలి.
స్టెప్ 4 – ఎక్స్రే సేతు సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
స్టెప్ 5- తర్వాత వైద్యుడు రోగి ఎక్స్రేను వాట్సాప్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.
This post was last modified on June 3, 2021 10:28 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…