ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నో రకాల క్లినికల్ ట్రయల్స్ తర్వాత.. కొన్ని వ్యాక్సిన్లకు ప్రభుత్వాలు అనుమతి తెలిపాయి. కాగా.. తాజాగా.. ఓ వ్యాక్సిన్ గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అత్యంత నమ్మకమైన వ్యాక్సిన్ గా పేరున్న ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువతకు గుండెనొప్పి సమస్యలు వస్తున్నాయంటూ ఓ పరిశోధనలో తేలడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ ఫైజర్ వ్యాక్సిన్ ని చాలా మంది తీసుకున్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరి గుండె పొరల్లో వాపు వచ్చినట్లు గుర్తించామని ఇజ్రాయిల్ పేర్కొంది.
ముఖ్యంగా పురుషుల్లో ఈవాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇప్పటి వరకు 275మందిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయిల్ లో 50లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్ వేశారు. వాపు రావడమే కాకుండా..గుండె సంబంధిత ఇతర సమస్యలు కూడా వస్తున్నట్లు గుర్తించడం గమనార్హం.
అయితే, ఈ వాపు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని… అలాంటి వారు నాలుగు రోజులకు మించి ఆసుపత్రుల్లో లేరని ఇజ్రాయిల్ తెలిపింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న 16-30ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఈ లక్షణాలు కనిపించాయని ఇజ్రాయిల్ తెలిపింది.
అయితే, తమకు ఈ గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు సమాచారం లేదని ఫైజర్ తెలిపింది. ఎంఆర్ఎన్ఏ వైరస్ కు, గుండె సంబంధిత వ్యాధులకు మధ్య ఎదైనా లింకుందా అన్న కోణంలో వ్యాక్సిన్ సెఫ్టీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఫైజర్ తెలిపింది. ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని ఫైజర్ కు అమెరికా అంటు వ్యాధుల నిరోధక సంస్థ కూడా సూచించింది.
This post was last modified on June 3, 2021 8:35 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…