ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నో రకాల క్లినికల్ ట్రయల్స్ తర్వాత.. కొన్ని వ్యాక్సిన్లకు ప్రభుత్వాలు అనుమతి తెలిపాయి. కాగా.. తాజాగా.. ఓ వ్యాక్సిన్ గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అత్యంత నమ్మకమైన వ్యాక్సిన్ గా పేరున్న ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువతకు గుండెనొప్పి సమస్యలు వస్తున్నాయంటూ ఓ పరిశోధనలో తేలడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ ఫైజర్ వ్యాక్సిన్ ని చాలా మంది తీసుకున్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరి గుండె పొరల్లో వాపు వచ్చినట్లు గుర్తించామని ఇజ్రాయిల్ పేర్కొంది.
ముఖ్యంగా పురుషుల్లో ఈవాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇప్పటి వరకు 275మందిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయిల్ లో 50లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్ వేశారు. వాపు రావడమే కాకుండా..గుండె సంబంధిత ఇతర సమస్యలు కూడా వస్తున్నట్లు గుర్తించడం గమనార్హం.
అయితే, ఈ వాపు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని… అలాంటి వారు నాలుగు రోజులకు మించి ఆసుపత్రుల్లో లేరని ఇజ్రాయిల్ తెలిపింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న 16-30ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఈ లక్షణాలు కనిపించాయని ఇజ్రాయిల్ తెలిపింది.
అయితే, తమకు ఈ గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు సమాచారం లేదని ఫైజర్ తెలిపింది. ఎంఆర్ఎన్ఏ వైరస్ కు, గుండె సంబంధిత వ్యాధులకు మధ్య ఎదైనా లింకుందా అన్న కోణంలో వ్యాక్సిన్ సెఫ్టీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఫైజర్ తెలిపింది. ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని ఫైజర్ కు అమెరికా అంటు వ్యాధుల నిరోధక సంస్థ కూడా సూచించింది.
This post was last modified on June 3, 2021 8:35 am
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…