రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది క్రిష్ణపట్నం ఆనందయ్య ఉదంతం. ఆయన తయారు చేసిన మందు కరోనాకు చెక్ పెట్టేలా ఉందన్న మాట వినిపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఈ మందులో ఉన్నవన్నీ సాధారణ వస్తువులేనని.. వాటిని వినియోగించటం వల్ల ఎలాంటి హాని ఉండదని తేల్చారు. మరింత లోతుగా ఆయన మందుపై అధ్యయనం చేస్తున్న సంస్థలు త్వరలో నివేదికలు ఇవ్వనున్నాయి.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు తాను మందు తయారు చేయనని చెప్పటమే కాదు.. సోషల్ మీడియా ద్వారా తమ వద్దకు ఎవరూ రావొద్దని ఆయన వెల్లడించారు కూడా. తన వద్ద మూలికలు.. సామాగ్రి లేవని.. మందు తయారు చేయటం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయనపై పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తడి ఉంది. ఇది సరిపోనట్లుగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆ మధ్యన ఆనందయ్యను తీసుకెళ్లిన పోలీసులు తర్వాత వదిలేయటం.. అరెస్టు చేయలేదని చెప్పటం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన్ను తీసుకెళ్లిన తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున వచ్చిన పోలీసులు ఆయన్ను తమతో తీసుకెళ్లారు. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. చివరకు ఆయన్ను నెల్లూరులోని సీవీఆర్ ఆకాడమీకి తీసుకెళ్లి.. అక్కడ ఉంచినట్లుగా తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
నలుగురికి సాయం చేయాలన్న ఉద్దేశంతో.. ఉచితంగా మందు తయారు చేసి ఇవ్వటమే ఆనందయ్య చేసిన తప్పా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఒకవేళ ఆయనకు హాని ఉంటుందన్న సందేహం ఉన్నా.. భద్రతా పరమైన సమస్యలు ఉంటాయన్న అనుమానం ఉంటే ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలే తప్పించి.. ఇలా నిర్బంధించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఆనందయ్య విషయంలో ప్రభుత్వం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటే.. అందుకే భిన్నంగా ప్రభుత్వంలో భాగమైన పోలీసుల తీరును తప్పు పడుతున్నారు.
This post was last modified on May 29, 2021 11:15 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…