Trends

తాజా సర్వే- కరోనాతో చనిపోయిన వారు ఎందరో తెలుసా ?

మనదేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు, మరణాల లెక్కలపై ప్రభుత్వం చెబుతున్న సమాచారానికి వాస్తవ సమాచారానికి చాలా తేడా ఉందా ? అవుననే అంటున్నది న్యూయార్క్ టైమ్స్ . న్యూయార్క్ టైమ్స్ ఆధ్వర్యంలో భారత్ లో కరోనా వైరస్ కేసులు, మరణాలపై ప్రత్యేకంగా సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆశ్చర్యకరం, భయానక లెక్కలు బయటపడ్డాయట.

తమ సర్వేలో మీడియా సంస్ధ 12 మంది నిపుణుల సహకారాన్ని తీసుకుంది. మూడు సీరో సర్వేల సమాచారం, గణాంకవేత్తల సూచనల ప్రకారం రిపోర్టు తయారుచేసింది న్యూయార్క్ టైమ్స్ మీడియా. ఈ లెక్కన దేశంలో కరోనా వైరస్ సుమారుగా 70 కోట్లమందికి సోకినట్లు లెక్కతేల్చింది. అలాగే మరణాలు కూడా 42 లక్షలుంటుందని అంచనా వేసింది.

మే నెల 24వ తేదీకి కేంద్రప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన లెక్కల్లో కరోనా వైరస్ కేసులు 2.69 కోట్లు, మరణాలు 3.07 లక్షలుంది. అంటే ఇటు ప్రభుత్వం అటు న్యూయార్క టైమ్స్ సర్వే లెక్కల ప్రకారం చూస్తే కేసులయినా మరణాలైనా చాలా రెట్ల వ్యత్యాసం ఉందని అర్ధమవుతోంది. కోవిడ్ మరణాల్లో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటోందని తేలింది. అయితే ఈ మరణాలేవీ అధికారిక రికార్డుల్లోకి ఎక్కటంలేదట.

గ్రామీణ ప్రాంతాల్లోని జనాలు పట్టణాలు, నగరాలకు వచ్చి వైద్యం చేయించుకునేంత అవకాశం లేకపోవటంతో తమ ఇళ్ళల్లోనే ఉంటున్నారట. ఇళ్ళల్లోనే కరోనాకు చికిత్స చేయించుకుంటు చనిపోతున్న వారే చాలా ఎక్కువట. ఇదే సమయంలో ప్రభుత్వం దగ్గర కోవిడ్ యంత్రాంగం కూడా పటిష్టంలేదని న్యూయార్క్ టైమ్స్ మీడియా చెప్పింది. సరే అన్నింటికీ మించి వాస్తవ లెక్కలను ఏ ప్రభుత్వం కూడా బయటకు చెప్పదు. ఎందుకంటే జనాలు భయపడే అవకాశం ఉంది కాబట్టి. మొత్తంమీద న్యూయార్క్ టైమ్స్ మీడియా బయటపెట్టిన సర్వే సంచలనంగా మారింది.

This post was last modified on May 27, 2021 3:18 pm

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

2 hours ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

3 hours ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

4 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

4 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

4 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

5 hours ago