Trends

మగాళ్ళపైనే పగపట్టిన కరోనా వైరస్

కరోనా వైరస్ ముఖ్యంగా మగాళ్ళపైనే పగబట్టినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రెండు విడతల్లోను కరోనా తీవ్రత మగాళ్ళపైనే ఎక్కువగా కనబడుతోంది. రోగుల్లో గానీ మరణాల్లో కానీ మగాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏదో అవసరాల వల్ల ఇంట్లో నుండి బయటకు వస్తున్న మగాళ్ళు వైరస్ దాడికి తీవ్రంగా గురవుతున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఊబకాయం, దురలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యాల వల్లే మగాళ్ళు ఎక్కువగా కరోనా వైరస్ తీవ్రతకు బలవుతున్నట్లు తెలుస్తోంది.

ఆడాళ్ళకన్నా మగాళ్ళల్లో ఇమ్యునిటి ఎక్కువగా ఉన్న కారణంగా కరోనా వైరస్ సోకినా బయటపడటానికి ఎక్కువ రోజులు పడుతోందట. దీనివల్ల ఏమవుతోందటంటే మగాళ్ళల్లో వైరస్ లక్షణాలు బయటపడేటప్పటికే లోలోపలే బాగా ముదిరిపోతోందని సమాచారం. మొదటి వేవ్ కన్నా సెకెండ్ వేవ్ లో వైరస్ తీవ్రత బాగా పెరిగిపోవటంతో కరోనా సోకిన రెండు మూడు రోజుల్లోనే ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రప్రభావం పడుతోంది. దీంతోనే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి ప్రాణాల మీదకొచ్చేస్తోంది.

మొదటిదశలో రాష్ట్రంలో 5,64,651 మంది మగాళ్ళు వైరస్ బారినపడ్డారట. వీరిలో మరణాల రేటు 0.90 శాతంగా నమోదైంది. 3,79,425 మంది స్త్రీలకు వైరస్ సోకితే మరణాల రేటు 0.32 శాతం. మరణించిన వారిలో పురుషులు 65 శాతమైతే స్త్రీలు 35 శాతమట. ఈ లెక్కల కారణంగానే వైరస్ దెబ్బకు ఎంతమంది మగాళ్ళు బలైపోతున్నారో అర్ధమైపోతోంది.

ఇక రెండోదశలో 6.5 లక్షల మందికి వైరస్ సోకితే ఇందులో 60 శాతం మగాళ్ళ మీదే ప్రభావం చూపిందట. ఇందులో మరణాల రేటు 0.80 శాతం. వైరస్ సోకిన మహిళల్లో మరణాల రేటు 0.30 శాతం. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కరోనా వైరస్ పంజాకు మగాళ్ళే బలైపోతున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి వైరస్ విషయంలో మగాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

This post was last modified on May 24, 2021 11:23 am

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

3 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago