Trends

మగాళ్ళపైనే పగపట్టిన కరోనా వైరస్

కరోనా వైరస్ ముఖ్యంగా మగాళ్ళపైనే పగబట్టినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రెండు విడతల్లోను కరోనా తీవ్రత మగాళ్ళపైనే ఎక్కువగా కనబడుతోంది. రోగుల్లో గానీ మరణాల్లో కానీ మగాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏదో అవసరాల వల్ల ఇంట్లో నుండి బయటకు వస్తున్న మగాళ్ళు వైరస్ దాడికి తీవ్రంగా గురవుతున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఊబకాయం, దురలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యాల వల్లే మగాళ్ళు ఎక్కువగా కరోనా వైరస్ తీవ్రతకు బలవుతున్నట్లు తెలుస్తోంది.

ఆడాళ్ళకన్నా మగాళ్ళల్లో ఇమ్యునిటి ఎక్కువగా ఉన్న కారణంగా కరోనా వైరస్ సోకినా బయటపడటానికి ఎక్కువ రోజులు పడుతోందట. దీనివల్ల ఏమవుతోందటంటే మగాళ్ళల్లో వైరస్ లక్షణాలు బయటపడేటప్పటికే లోలోపలే బాగా ముదిరిపోతోందని సమాచారం. మొదటి వేవ్ కన్నా సెకెండ్ వేవ్ లో వైరస్ తీవ్రత బాగా పెరిగిపోవటంతో కరోనా సోకిన రెండు మూడు రోజుల్లోనే ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రప్రభావం పడుతోంది. దీంతోనే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి ప్రాణాల మీదకొచ్చేస్తోంది.

మొదటిదశలో రాష్ట్రంలో 5,64,651 మంది మగాళ్ళు వైరస్ బారినపడ్డారట. వీరిలో మరణాల రేటు 0.90 శాతంగా నమోదైంది. 3,79,425 మంది స్త్రీలకు వైరస్ సోకితే మరణాల రేటు 0.32 శాతం. మరణించిన వారిలో పురుషులు 65 శాతమైతే స్త్రీలు 35 శాతమట. ఈ లెక్కల కారణంగానే వైరస్ దెబ్బకు ఎంతమంది మగాళ్ళు బలైపోతున్నారో అర్ధమైపోతోంది.

ఇక రెండోదశలో 6.5 లక్షల మందికి వైరస్ సోకితే ఇందులో 60 శాతం మగాళ్ళ మీదే ప్రభావం చూపిందట. ఇందులో మరణాల రేటు 0.80 శాతం. వైరస్ సోకిన మహిళల్లో మరణాల రేటు 0.30 శాతం. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే కరోనా వైరస్ పంజాకు మగాళ్ళే బలైపోతున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి వైరస్ విషయంలో మగాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

This post was last modified on May 24, 2021 11:23 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

11 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

12 hours ago