ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 లక్షల డోసులను కేంద్రం తగ్గించేసింది.
రెండు ఫార్మాకంపెనీల్లో ఉత్పత్తవుతున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల్లో 50 శాతం కేంద్రమే సేకరిస్తోంది. మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు సంస్ధలకు ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తోంది. అయితే ఈ సరఫరా కూడా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నదిలేండి. కేంద్రం అన్నీ రాష్ట్రాలకు తొలివిడతలో అంటే మేనెల 1-15 మధ్యలో అందించిన డోసులు 2 కోట్ల 12 లక్షల 50 వేలు.
ఇక మే 16-30 మధ్యలో అన్నీ రాష్ట్రాలకు అందించిన రెండో డోసులు 1 కోటి 91 లక్షల 49 వేలు. మూడో డోసు అంటే జూన్ 1-15 మధ్య కేటాయించినవి 1 కోటి 82 లక్షల 30 వేలు. అంటే ఈ డోసులు రాష్ట్రాలకు ఇంకా అందాల్సున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి విడత కేటాయింపులతో పోల్చితే రెండో విడత డోసులు 21 లక్షలు తగ్గిపోయాయి. అలాగే రెండో విడతతో పోల్చుకుంటే రావాల్సిన మూడో డోసులు 30 లక్షలు తగ్గిపోయాయి.
పై లెక్కలన్నీ కేంద్రప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారికంగా వెబ్ సైట్లో పెట్టినవే. పై లెక్కలను గమనించిన తర్వాత రాష్ట్రాలకు తగ్గించేస్తున్న లక్షలాది డోసుల లెక్కలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఒకవైపు లక్షలాది డోసులను తగ్గించేస్తు మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేయాలని ప్రధానమంత్రి పిలుపివ్వటంలో అర్ధమేంటి ? టీకాల విషయంలోనే కాదు ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం డబల్ గేమ్ అర్ధమైపోతోంది.
This post was last modified on May 20, 2021 9:08 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…