Trends

టీకాలను తగ్గించేస్తున్న కేంద్రం

ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 లక్షల డోసులను కేంద్రం తగ్గించేసింది.

రెండు ఫార్మాకంపెనీల్లో ఉత్పత్తవుతున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల్లో 50 శాతం కేంద్రమే సేకరిస్తోంది. మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు సంస్ధలకు ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తోంది. అయితే ఈ సరఫరా కూడా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నదిలేండి. కేంద్రం అన్నీ రాష్ట్రాలకు తొలివిడతలో అంటే మేనెల 1-15 మధ్యలో అందించిన డోసులు 2 కోట్ల 12 లక్షల 50 వేలు.

ఇక మే 16-30 మధ్యలో అన్నీ రాష్ట్రాలకు అందించిన రెండో డోసులు 1 కోటి 91 లక్షల 49 వేలు. మూడో డోసు అంటే జూన్ 1-15 మధ్య కేటాయించినవి 1 కోటి 82 లక్షల 30 వేలు. అంటే ఈ డోసులు రాష్ట్రాలకు ఇంకా అందాల్సున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి విడత కేటాయింపులతో పోల్చితే రెండో విడత డోసులు 21 లక్షలు తగ్గిపోయాయి. అలాగే రెండో విడతతో పోల్చుకుంటే రావాల్సిన మూడో డోసులు 30 లక్షలు తగ్గిపోయాయి.

పై లెక్కలన్నీ కేంద్రప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారికంగా వెబ్ సైట్లో పెట్టినవే. పై లెక్కలను గమనించిన తర్వాత రాష్ట్రాలకు తగ్గించేస్తున్న లక్షలాది డోసుల లెక్కలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఒకవైపు లక్షలాది డోసులను తగ్గించేస్తు మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేయాలని ప్రధానమంత్రి పిలుపివ్వటంలో అర్ధమేంటి ? టీకాల విషయంలోనే కాదు ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం డబల్ గేమ్ అర్ధమైపోతోంది.

This post was last modified on May 20, 2021 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago