Trends

టీకాలను తగ్గించేస్తున్న కేంద్రం

ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 లక్షల డోసులను కేంద్రం తగ్గించేసింది.

రెండు ఫార్మాకంపెనీల్లో ఉత్పత్తవుతున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల్లో 50 శాతం కేంద్రమే సేకరిస్తోంది. మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు సంస్ధలకు ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తోంది. అయితే ఈ సరఫరా కూడా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నదిలేండి. కేంద్రం అన్నీ రాష్ట్రాలకు తొలివిడతలో అంటే మేనెల 1-15 మధ్యలో అందించిన డోసులు 2 కోట్ల 12 లక్షల 50 వేలు.

ఇక మే 16-30 మధ్యలో అన్నీ రాష్ట్రాలకు అందించిన రెండో డోసులు 1 కోటి 91 లక్షల 49 వేలు. మూడో డోసు అంటే జూన్ 1-15 మధ్య కేటాయించినవి 1 కోటి 82 లక్షల 30 వేలు. అంటే ఈ డోసులు రాష్ట్రాలకు ఇంకా అందాల్సున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి విడత కేటాయింపులతో పోల్చితే రెండో విడత డోసులు 21 లక్షలు తగ్గిపోయాయి. అలాగే రెండో విడతతో పోల్చుకుంటే రావాల్సిన మూడో డోసులు 30 లక్షలు తగ్గిపోయాయి.

పై లెక్కలన్నీ కేంద్రప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారికంగా వెబ్ సైట్లో పెట్టినవే. పై లెక్కలను గమనించిన తర్వాత రాష్ట్రాలకు తగ్గించేస్తున్న లక్షలాది డోసుల లెక్కలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఒకవైపు లక్షలాది డోసులను తగ్గించేస్తు మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేయాలని ప్రధానమంత్రి పిలుపివ్వటంలో అర్ధమేంటి ? టీకాల విషయంలోనే కాదు ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం డబల్ గేమ్ అర్ధమైపోతోంది.

This post was last modified on May 20, 2021 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago