Trends

హ్యాపీ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో శాస్త్రవేత్తలు హ్యాపీన్యూస్ చెప్పారు. ప్రస్తుత తీవ్రత జూలై నెలలో బాగా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మొదటి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికించేస్తు సంక్షోభంలోకి నెట్టేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. చాలా రాష్ట్రాలు సెకెండ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక కుదేలైపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కరోనా సెకెండ్ వేవ్ కట్టడిలో విఫలమై చేతులెత్తేశాయి.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నుండి ఉత్తర ప్రదేశ్ ను దేవుడే కాపాడాలని స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించిందంటే అక్కడ పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో సమస్య తీవ్రతను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం జూలైలో సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిపోతుందన్నారు. అలాగే అందరు భయపడుతున్న మూడో వేవ్ 6-8 నెలల తర్వాత మాత్రమే ఉండవచ్చని అనుమానించారు. అయితే, జనాలందరు భయపడుతున్నట్లుగా అంత తీవ్రత ఉండకపోవచ్చని కూడా చెప్పారు.

మే నెలాఖరుకు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజుకు 1.5 లక్షలకు తగ్గిపోవచ్చని బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 4 లక్షలు దాటిన విషయం అందరికీ తెలిసిందే. 4 లక్షల మార్కు నుండి 1.5 లక్షలకు తగ్గటమంటే మంచి విషయమే. ఈ కేసుల సంఖ్య జూన్ చివరకు 20 వేలకు పడిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్ధాన్, కేరళ, సిఖ్ఖిం, ఉత్తరాఖండ్, హర్యానా, గోవాలో కరోనా సెకెండ్ వేవ్ అత్యంత ఎక్కువగా ఉందని తెలిసిందే.

ఇక ఈనెల 19-30వ తేదీల మధ్య తమిళనాడు, పాండిచ్చేరి, పంజాబ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత తీవ్రదశకు చేరుకునే ప్రమాధముందని కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మూడోదశ స్ధానికంగా మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయిస్తే కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని కూడా శాస్త్రజ్ఞులు చెప్పటం హ్యాపీ న్యూసే కదా.

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

2 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

5 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

6 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

6 hours ago