Trends

హ్యాపీ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో శాస్త్రవేత్తలు హ్యాపీన్యూస్ చెప్పారు. ప్రస్తుత తీవ్రత జూలై నెలలో బాగా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మొదటి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికించేస్తు సంక్షోభంలోకి నెట్టేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. చాలా రాష్ట్రాలు సెకెండ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక కుదేలైపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కరోనా సెకెండ్ వేవ్ కట్టడిలో విఫలమై చేతులెత్తేశాయి.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నుండి ఉత్తర ప్రదేశ్ ను దేవుడే కాపాడాలని స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించిందంటే అక్కడ పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో సమస్య తీవ్రతను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం జూలైలో సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిపోతుందన్నారు. అలాగే అందరు భయపడుతున్న మూడో వేవ్ 6-8 నెలల తర్వాత మాత్రమే ఉండవచ్చని అనుమానించారు. అయితే, జనాలందరు భయపడుతున్నట్లుగా అంత తీవ్రత ఉండకపోవచ్చని కూడా చెప్పారు.

మే నెలాఖరుకు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజుకు 1.5 లక్షలకు తగ్గిపోవచ్చని బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 4 లక్షలు దాటిన విషయం అందరికీ తెలిసిందే. 4 లక్షల మార్కు నుండి 1.5 లక్షలకు తగ్గటమంటే మంచి విషయమే. ఈ కేసుల సంఖ్య జూన్ చివరకు 20 వేలకు పడిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్ధాన్, కేరళ, సిఖ్ఖిం, ఉత్తరాఖండ్, హర్యానా, గోవాలో కరోనా సెకెండ్ వేవ్ అత్యంత ఎక్కువగా ఉందని తెలిసిందే.

ఇక ఈనెల 19-30వ తేదీల మధ్య తమిళనాడు, పాండిచ్చేరి, పంజాబ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత తీవ్రదశకు చేరుకునే ప్రమాధముందని కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మూడోదశ స్ధానికంగా మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయిస్తే కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని కూడా శాస్త్రజ్ఞులు చెప్పటం హ్యాపీ న్యూసే కదా.

This post was last modified on May 20, 2021 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago