2 డియాక్సీ డి క్లూకోజ్.. షార్ట్గా చెప్పాలంటే 2 డీజీ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మందు. కరోనా నియంత్రణకు ఈ మందు చాలా ఉపయోగపడుతుందంటూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ మందును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిన సంగతే. ఈ మందు గురించి జనాలు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. వివిధ మార్గాల్లో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ మందు కథాకమామిషు ఏంటి.. కరోనా చికిత్సలో దీన్ని ఎలా వినియోగిస్తున్నారు.. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. దీని గురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం పదండి.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే తెలుగు వైద్య నిపుణుడు డాక్టర్ ఏవీఎస్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం.. 2 డీజీ మందును మొదట రేడియేషన్ ప్రొటెక్షన్ ఏజెంట్గా అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రోగులకు ఇచ్చే రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిమాణాలను నివారించడానికి 30 నిమిషాల ముందు దీన్ని ఇస్తారు. ఈ మందుకు వైరస్ను కట్టడి చేసే గుణం ఉందని పరిశోధనల్లో కనుక్కున్నారు. ఈ 2 డీజీ.. వైరస్కు కావాల్సిన గ్లూకోజ్ను అందకుండా చేసి దాని పునరుత్పత్తిని నివారించడం ద్వారా వైరస్ను కట్టడి చేస్తుందని పరిశోధనలో తేలింది. కాబట్టి దీనికి యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లేమేటరీ గుణాలు ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు.
కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మొత్తం మూడు దశలలో కలిపి 330 మంది రోగుల మీద పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో 2 డీజీ ఒక మోస్తరు నుంచి ఎక్కువ తీవ్రత ఉన్న రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడటం తగ్గించి త్వరగా ఉపశమనం కలుగజేస్తుందని తేలింది. ఐతే ఈ పరిశోధనా ఫలితాలు ప్రకటించలేదు. వ్యాధి తీవ్రత ఒక మోస్తరు నుంచి అతి తీవ్రంగా ఉండి,ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉండి ఇంకా ఐసీయూ అవసరం పడని రోగులకు ఈ మందును ఇవ్వమని చెబుతున్నారు. 2డీజీ మందును 45 గ్రాముల పరిమాణంలో ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని రోజుకి 2 సార్లు 10 రోజులపాటు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రస్తుతం 5000 ప్యాకెట్లు తయారు చేసి రక్షణ దళానికి ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటి వారానికల్లా బహిరంగ మార్కెట్ లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on May 18, 2021 9:12 pm
థియేటర్లలో అడుగు పెట్టిన మొదటి రోజే హిట్ 3 ది థర్డ్ కేస్ డీల్ చేసిన అర్జున్ సర్కార్ సిక్సర్…
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్ గాంలో జరిపిన దాడి పలు అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పటి భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన…
వచ్చిన దాని ఒరిజినల్ వెర్షన్ రైడ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ మనీ…
వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవరో కాదు.. జగన్కు…
జనాలు థియేటర్లకు రావడాన్ని తగ్గించడం వెనుక కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ అంతకన్నా సీరియస్ గా చూడాల్సిన…
అమరావతి రాజధానికి కొత్తగా రెక్కలు తొడిగాయి. సీఎం చంద్రబాబు దూరదృష్టికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులు క్యూకట్టారు. ప్రధాన…