Trends

చేయని నేరానికి జైలు.. రూ.550 కోట్ల పరిహారం

చేయని తప్పులకు శిక్ష అనుభవించేటోళ్లు చాలామందే ఉంటారు. సరైన సమయంలో సరైన న్యాయం దొరక్క.. దాని బారిన పడి బాధితులుగా మారెవారెందరో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. అమెరికాకు చెందిన ఇద్దరు సోదరులు చేయని తప్పునకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గారు. చివరకు వారు ఎలాంటి తప్పు చేయలేదని.. వారు నిర్దోషులని తేలింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ఇంతకీ.. ఆ విధి వంచిత సోదరులు ఎవరు? వారి మీద ఉన్న ఆరోపణ ఏమిటి? మూడు దశాబ్దాలు జైల్లో మగ్గిన తర్వాత వారు తప్పు చేయలేదని ఎలా తేలింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

అమెరికాకు చెందిన హెన్రీ మెక్ కాలమ్.. లియోన్ బ్రౌన్ ఇద్దరు సోదరులు. మీ అంచనా కరెక్టే. వారిద్దరు నల్లజాతీయులు. 1983లో పదకొండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే.. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తమను విడిచిపెట్టాలని కోరారు. అయినప్పటికి వారిపై అత్యాచార.. హత్య చేసిన నేరాన్ని మోపారు.

వారెంత మొత్తుకున్నా వారి గోడును విన్నోళ్లు లేరు. విచారణ జరిపిన కోర్టు వారికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో.. వారిద్దరు జైలుకే పరిమితమయ్యారు. ఈ కేసుకు సంబంధించి అనుకోని మలుపు 2014లో చోటు చేసుకుంది. ఈ సోదరుల ఇద్దరి డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో.. బాలికను రేప్ చేసి చంపింది వీరు కాదని తేలింది. ఇదిలా ఉండగా.. తమకు జరిగిన అన్యాయంపై వారు గళం విప్పారు. తాము తప్పు చేయకున్నా.. ఇంతకాలం శిక్ష అనుభవించామని.. విచారణ పేరుతో సుదీర్ఘకాలం శారీరక హింసకు గురైనట్లు పేర్కొన్నారు.

నార్త్ కరోలినా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ ఇద్దరు సోదరులకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందించింది. చేయని నేరానికి మూడు దశాబ్దాలకు పైనే జైలుశిక్ష అనుభవించినదానికి ఈ ఇద్దరు సోదరులకు రూ.550 కోట్ల పరిహారం మొత్తంగా ఇవ్వాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

19 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

48 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago