చేయని తప్పులకు శిక్ష అనుభవించేటోళ్లు చాలామందే ఉంటారు. సరైన సమయంలో సరైన న్యాయం దొరక్క.. దాని బారిన పడి బాధితులుగా మారెవారెందరో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. అమెరికాకు చెందిన ఇద్దరు సోదరులు చేయని తప్పునకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గారు. చివరకు వారు ఎలాంటి తప్పు చేయలేదని.. వారు నిర్దోషులని తేలింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ఇంతకీ.. ఆ విధి వంచిత సోదరులు ఎవరు? వారి మీద ఉన్న ఆరోపణ ఏమిటి? మూడు దశాబ్దాలు జైల్లో మగ్గిన తర్వాత వారు తప్పు చేయలేదని ఎలా తేలింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
అమెరికాకు చెందిన హెన్రీ మెక్ కాలమ్.. లియోన్ బ్రౌన్ ఇద్దరు సోదరులు. మీ అంచనా కరెక్టే. వారిద్దరు నల్లజాతీయులు. 1983లో పదకొండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే.. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తమను విడిచిపెట్టాలని కోరారు. అయినప్పటికి వారిపై అత్యాచార.. హత్య చేసిన నేరాన్ని మోపారు.
వారెంత మొత్తుకున్నా వారి గోడును విన్నోళ్లు లేరు. విచారణ జరిపిన కోర్టు వారికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో.. వారిద్దరు జైలుకే పరిమితమయ్యారు. ఈ కేసుకు సంబంధించి అనుకోని మలుపు 2014లో చోటు చేసుకుంది. ఈ సోదరుల ఇద్దరి డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో.. బాలికను రేప్ చేసి చంపింది వీరు కాదని తేలింది. ఇదిలా ఉండగా.. తమకు జరిగిన అన్యాయంపై వారు గళం విప్పారు. తాము తప్పు చేయకున్నా.. ఇంతకాలం శిక్ష అనుభవించామని.. విచారణ పేరుతో సుదీర్ఘకాలం శారీరక హింసకు గురైనట్లు పేర్కొన్నారు.
నార్త్ కరోలినా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ ఇద్దరు సోదరులకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందించింది. చేయని నేరానికి మూడు దశాబ్దాలకు పైనే జైలుశిక్ష అనుభవించినదానికి ఈ ఇద్దరు సోదరులకు రూ.550 కోట్ల పరిహారం మొత్తంగా ఇవ్వాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
This post was last modified on May 17, 2021 11:27 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…