చేయని తప్పులకు శిక్ష అనుభవించేటోళ్లు చాలామందే ఉంటారు. సరైన సమయంలో సరైన న్యాయం దొరక్క.. దాని బారిన పడి బాధితులుగా మారెవారెందరో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందింది. అమెరికాకు చెందిన ఇద్దరు సోదరులు చేయని తప్పునకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గారు. చివరకు వారు ఎలాంటి తప్పు చేయలేదని.. వారు నిర్దోషులని తేలింది. అప్పుడు కోర్టు ఏం చేసింది? ఇంతకీ.. ఆ విధి వంచిత సోదరులు ఎవరు? వారి మీద ఉన్న ఆరోపణ ఏమిటి? మూడు దశాబ్దాలు జైల్లో మగ్గిన తర్వాత వారు తప్పు చేయలేదని ఎలా తేలింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
అమెరికాకు చెందిన హెన్రీ మెక్ కాలమ్.. లియోన్ బ్రౌన్ ఇద్దరు సోదరులు. మీ అంచనా కరెక్టే. వారిద్దరు నల్లజాతీయులు. 1983లో పదకొండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. అయితే.. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తమను విడిచిపెట్టాలని కోరారు. అయినప్పటికి వారిపై అత్యాచార.. హత్య చేసిన నేరాన్ని మోపారు.
వారెంత మొత్తుకున్నా వారి గోడును విన్నోళ్లు లేరు. విచారణ జరిపిన కోర్టు వారికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో.. వారిద్దరు జైలుకే పరిమితమయ్యారు. ఈ కేసుకు సంబంధించి అనుకోని మలుపు 2014లో చోటు చేసుకుంది. ఈ సోదరుల ఇద్దరి డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో.. బాలికను రేప్ చేసి చంపింది వీరు కాదని తేలింది. ఇదిలా ఉండగా.. తమకు జరిగిన అన్యాయంపై వారు గళం విప్పారు. తాము తప్పు చేయకున్నా.. ఇంతకాలం శిక్ష అనుభవించామని.. విచారణ పేరుతో సుదీర్ఘకాలం శారీరక హింసకు గురైనట్లు పేర్కొన్నారు.
నార్త్ కరోలినా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ ఇద్దరు సోదరులకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందించింది. చేయని నేరానికి మూడు దశాబ్దాలకు పైనే జైలుశిక్ష అనుభవించినదానికి ఈ ఇద్దరు సోదరులకు రూ.550 కోట్ల పరిహారం మొత్తంగా ఇవ్వాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
This post was last modified on May 17, 2021 11:27 am
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…