Trends

నేడే విడుదల

కోవిడ్ వైరస్ నియంత్రణకు డీఆర్డీవో శ్రమించి డెవలప్ చేసిన 2 డీజీ మందు సోమవారమే విడుదలవుతోంది. కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో 2 డీజీ ఔషధాన్ని విడుదల చేస్తున్నారు. కేంద్రమంత్రులు రిలీజ్ చేయగానే సోమవారం 10 వేల పాకెట్లు (సాచెట్లు) మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈనెల 27, 28 తేదీల నుండి మరిన్ని సాచెట్లను ప్రతిరోజు మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు డీఆర్డీవో ప్లాన్ చేస్తోంది.

నిజానికి ఈ మందును గతంలో క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. అదే ఫార్ములాతో ఇపుడు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉపయోగించవచ్చనే ఉద్దేశ్యంతో డెవలప్ చేశారు. శాస్త్రజ్ఞుల పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చినట్లు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. జూన్ నుండి పూర్తిస్ధాయిలో సాచెట్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.

అంటే జూన్ నెలనుండి ఒకవైపు కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలతో పాటు మరోవైపు 2 డీజీ సాచెట్లు కూడా జనాలకు అందుబాటులో రాబోతున్నాయనే అనుకోవాలి. ఒక్కసారిగా టీకాలు, సాచెట్లు అందుబాటులోకి రాబోతున్న కారణంగా కరోనా వైరస్ ను జయించటం జనాలకు పెద్ద కష్టం కాబోదనే అనిపిస్తోంది. ఇదే సమయంలో టీకాలు, సాచెట్ల విషయంలో ప్రభుత్వాలపైన ఒత్తిడి తగ్గటం మంచి పరిణామమే.

దేశంమొత్తం కోవిడ్ పై పోరాడే ఔషధం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తాము డెవలప్ చేసిన 2 డీజీ మార్కెట్లోకి రావటం సంతోషంగా ఉందన్నారు సతీష్. తాము నిర్వహించిన 2డీజీ క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని నమ్మకంగా చెప్పారు. మొత్తంమీద కరోనాపై యుద్ధం చేసేందుకు ఎన్ని ఆయుధాలు సమకూరితే జనాలకు అంత మంచిదే కదా.

This post was last modified on May 17, 2021 10:55 am

Share
Show comments

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

58 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago