Trends

కరోనా కల్లోలం.. కొన్ని పాజిటివ్ వార్తలు


కరోనా కథ ముగిసిందని.. ఇక వైరస్ భయం లేదని రెండు నెలల ముందు చాలా ధీమాగా ఉన్నారు జనాలు. కానీ ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ చూస్తుండగానే ఉద్ధృత స్థాయికి చేరుకుంది. తొలి దశను మించి వైరస్ కల్లోలం రేపడం మొదలుపెట్టింది. గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో విషాదాలు చూశాం. ఒక దశలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మరణాలు చూశాం. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక, అత్యవసర మందులు దొరక్క వందలు వేలమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అంతకంతకూ తీవ్రత పెరుగుతుండటంతో జనాలకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.

బాగా తెలిసిన వాళ్లు, ఆరోగ్యంగా కనిపించిన వాళ్లు ఉన్నట్లుండి చనిపోయారన్న వార్తలతో జనాలు తల్లడిల్లిపోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయి.. ఆయా కుటుంబాలు అతలాకుతలం అయిన పరిస్థితులు చూశాం. ఇంకా ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని భయపడిపోయాం.

ఐతే గత వారం రోజుల్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. కరోనా కాస్త కనికరం చూపుతోంది. వైరస్ ప్రభావం తగ్గుతోంది. వారం కిందట ఒక దశలో దేశంలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షల 26 వేలకు చేరుకున్నాయి. కానీ అక్కడి నుంచి కేసులు తగ్గడం మొదలయ్యాయి. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు అటు ఇటుగా ఉంటోంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆరోగ్యం విషమిస్తున్న వారి సంఖ్యా తగ్గుముఖం పట్టింది. ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం విజ్ఞప్తులు తగ్గాయి. ఇప్పుడు బెడ్స్ కోసం మరీ కష్టపడాల్సిన పని లేదు.

ఆసుపత్రుల్లో బెడ్స్ పెరగడం.. అదే సమయంలో పరిస్థితి విషమిస్తున్న వారి సంఖ్య తగ్గడం శుభసూచకమే. ఆక్సిజన్ నిల్వలు కూడా పెరిగాయి. సరఫరా బాగానే ఉంటోంది. మరోవైపు వ్యాక్సిన్ కొరత తగ్గించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రాలకు 60 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ నిల్వలు పెరగబోతున్నాయి. లాక్ డౌన్ కూడా ఫలితాన్నిస్తూ వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. మొత్తానికి జనాలు ఉపశమనం పొందే రోజులు త్వరలోనే వస్తున్నట్లు కనిపిస్తోంది.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

29 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

37 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago