అవును యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఒక గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయిందట. ఇందుకు కారణం ఏమిటంటే గ్రామంలోని జనాలందరు ఒకే కట్టుబాటుమీద నిలబడటం. ఎవరు తమ గ్రామంలోకి రావద్దు..తామెవరము గ్రామం దాటి వయటకు వెళ్ళకూడదు అనే కట్టుబాటును స్ట్రిక్టుగా అమలు చేయటం వల్ల కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదట.
కృష్ణాజిల్లాలోని జీకొండూరు మండలంలోని దుగ్గిరాలపాడు గ్రామం గురించే ఇదంతా. ప్రపంచాన్ని కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కబళించటం మొదలవ్వగానే మొన్నటి మార్చిలో గ్రామంలోని పెద్దలంతా సమావేశమయ్యారట. గ్రాస్తులెవరు గ్రామ సరిహద్దులు దాటి బయటకు వెళ్ళకూడదని తీర్మానించారట. అలాగే బయటవారు ఎవరినీ తమ గ్రామంలోకి రావద్దని స్పష్టంగా చెప్పేశారట. గ్రామం బయటుంటున్న కుటుంబ సభ్యులు, బంధువులను కూడా రావద్దని ఫోన్ ద్వారా చెప్పేశారట.
గ్రామ పంచాయితిలో 8 వార్డులున్నాయట. అలాగే గ్రామంలో ఎనిమిది కిరాణా షాపులున్నాయట. పంచాయితి జనాల్లో 80 శాతం వ్యవసాయం పై ఆధార పడ్డ వారే. వీరిలో కూడా వ్యవసాయ కూలీలే అత్యధికం. మరి ఇలాంటి వాళ్ళను పనులకు బయటకు వెళ్ళద్దంటే వాళ్ళకు రోజు గడిచేదెలా ? అందుకనే రోజువారి కూలీకి వెళ్ళే వాళ్ళకోసమని గ్రామంలోనే గ్రామీణ ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారు. పంచాయితి అధికారులను ఒప్పించి ఉపాధి హామీ పనులను మంజూరు చేయించుకుని మొదలుపెట్టేశారట.
రోజు వారి సరుకులు, కూర గాయలు అవసరమైన వాళ్ళు ఒకేసారి షాపుల దగ్గరకు రానీయకుండా వార్డుల వారీగా రోజుకో వార్డులోని జనాలు కొనుగోళ్ళు చేసేలా తీర్మానించారు. ఇలాంటి అనేక తీర్మానాలను గట్టిగా అమలు చేస్తున్న కారణంగానే మొన్నటి మార్చి నుండి దుగ్గిరలపాడు గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. తీర్మానాలు చేయటమే కాకుండా చేసుకున్న తీర్మానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న గ్రామస్తులను అభినందించాల్సిందే.
This post was last modified on May 15, 2021 3:27 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…