కరోనా విషయంలో ముందుగా హెచ్చరించలేదని బాధపడుతుంటాం. కానీ, కొన్ని కొన్ని హెచ్చరికలు మన దాకా వస్తే.. మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది! అంత భీతా వహ పరిస్థితి ఎదురవుతుందా? అని చెమటలు కూడా పడతాయి. ఇప్పుడు ఇలాంటి అంచనానే ఒకటి దేశాన్ని సైతం కలవరపరుస్తోంది. దేశంలోనే ప్రఖ్యాతి గడించిన సంస్థ.. ఐఐఎస్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) తాజాగా కర్ణాటక రాజధాని, దేశానికే ఐటీ కేపిటల్గా ఉన్న బెంగళూరులో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసింది. ఇక్కడి పరిస్థితులను తాజాగా ఒక నివేదిక రూపంలో కేంద్రానికి అందజేసింది.
ఇప్పుడు ఐఐఎస్ ఇచ్చిన నివేదికలోని అంశాలు బయటకు పొక్కాయి. ఈ విషయాలు తెలిసి.. ప్రతి ఒక్కరూ నివ్వెర పోతున్నారు. ఐఐఎస్ నివేదిక ప్రకారం.. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నివేదిక పేర్కొంది. వచ్చే నెల(జూన్) 11 నాటికి బెంగళూరులో మరో 14 వేల మంది కరోనా తో మరణిస్తారని ఇనిస్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు. అంటే.. రోజుకు కనీసంలో కనీసంగా 466 మంది చనిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అమల్లో ఉన్న లాక్డౌన్ తరహా ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.
నమోదవుతున్న ఒక్కో కేసు వెనక, వెలుగులోకి రాని రెండు కేసులు ఉన్నాయని ఐఐఎస్ నిపుణులు పేర్కొన్నారు. నిజానికి మరణాల సంఖ్య 26 వేల వరకు ఉంటుందని ఐఐఎస్ నిపుణులు తొలుత అంచనా వేశారు. అయితే, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా ఈ సంఖ్య 14 వేలకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కనీసం రెండు వారాలపాటు కర్ణాటకలో కరోనా ప్రమాదకరస్థాయిలో ఉంటుందని తెలిపారు. అలాగే, 10 నుంచి 14 రోజులపాటు కరోన మరణాలు తీవ్రస్థాయిలో ఉంటాయని వివరించారు.
This post was last modified on May 11, 2021 8:01 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…