Trends

‘ఐఐఎస్‌’ అంచ‌నా నిజ‌మైతే.. బెంగ‌ళూరు శ‌వాల దిబ్బే!

క‌రోనా విష‌యంలో ముందుగా హెచ్చ‌రించ‌లేద‌ని బాధ‌ప‌డుతుంటాం. కానీ, కొన్ని కొన్ని హెచ్చ‌రిక‌లు మ‌న దాకా వ‌స్తే.. మాత్రం ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది! అంత భీతా వ‌హ ప‌రిస్థితి ఎదురవుతుందా? అని చెమ‌ట‌లు కూడా ప‌డ‌తాయి. ఇప్పుడు ఇలాంటి అంచ‌నానే ఒక‌టి దేశాన్ని సైతం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. దేశంలోనే ప్ర‌ఖ్యాతి గ‌డించిన సంస్థ‌.. ఐఐఎస్(ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌) తాజాగా క‌ర్ణాట‌క రాజ‌ధాని, దేశానికే ఐటీ కేపిట‌ల్‌గా ఉన్న బెంగ‌ళూరులో క‌రోనా ప‌రిస్థితిపై అధ్య‌య‌నం చేసింది. ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను తాజాగా ఒక నివేదిక రూపంలో కేంద్రానికి అంద‌జేసింది.

ఇప్పుడు ఐఐఎస్ ఇచ్చిన నివేదిక‌లోని అంశాలు బ‌య‌ట‌కు పొక్కాయి. ఈ విష‌యాలు తెలిసి.. ప్ర‌తి ఒక్క‌రూ నివ్వెర పోతున్నారు. ఐఐఎస్‌ నివేదిక ప్ర‌కారం.. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నివేదిక పేర్కొంది. వచ్చే నెల(జూన్‌) 11 నాటికి బెంగళూరులో మరో 14 వేల మంది కరోనా తో మరణిస్తారని ఇనిస్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు. అంటే.. రోజుకు క‌నీసంలో క‌నీసంగా 466 మంది చ‌నిపోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.

నమోదవుతున్న ఒక్కో కేసు వెనక, వెలుగులోకి రాని రెండు కేసులు ఉన్నాయని ఐఐఎస్ నిపుణులు పేర్కొన్నారు. నిజానికి మ‌ర‌ణాల‌ సంఖ్య 26 వేల వరకు ఉంటుందని ఐఐఎస్ నిపుణులు తొలుత అంచనా వేశారు. అయితే, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా ఈ సంఖ్య 14 వేలకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కనీసం రెండు వారాలపాటు కర్ణాటకలో కరోనా ప్రమాదకరస్థాయిలో ఉంటుందని తెలిపారు. అలాగే, 10 నుంచి 14 రోజులపాటు కరోన మరణాలు తీవ్రస్థాయిలో ఉంటాయని వివరించారు.

This post was last modified on May 11, 2021 8:01 am

Share

Recent Posts

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

14 minutes ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

3 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

5 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

5 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

7 hours ago