Trends

బీసీసీఐ వినూత్న ప్రయోగం

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును ఎంపిక చేయడం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరుగా కెప్టెన్లను ఎంపిక చేయడం విదేశీ జట్ల విషయంలో చూస్తుంటాం. కానీ ఇండియన్ క్రికెట్ టీం విషయంలో సాధారణంగా ఇలా జరగదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను చూస్తుంటాం. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత సీనియర్లంతా తప్పుకుని.. ధోని నేతృత్వంలో ఓ యువ జట్టు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లి అసాధారణ విజయం సాధించడం తెలిసిందే. ఐతే ఇప్పుడు తాత్కాలికంగా అలాంటి ప్రయోగమే చేయబోతోంది బీసీసీఐ.

వచ్చే నెల 2న కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ముందు న్యూజిలాండ్‌తో జూన్ 18-22 తేదీల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాక.. జులైలో వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది కోహ్లీసేన.

ఐతే జులైలో కోహ్లి బృందం ఇంగ్లాండ్‌లో ఉండగానే మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లబోతుండటం విశేషం. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని ధావన్, హార్దిక్ పాండ్య, చాహల్, భువనేశ్వర్ లాంటి ఆటగాళ్లతో వేరే జట్టును ఎంపిక చేసి శ్రీలంకకు పంపబోతోంది బీసీసీఐ. ఈ పర్యటనలో టీమ్ ఇండియా.. లంకతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుందట. అక్టోబరులో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో వన్డే, టీ20 స్పెషలిస్టులు చాలామంది ఖాళీగా ఉండటంతో ఈ సిరీస్‌కు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ.

కోహ్లి, రోహిత్, బుమ్రా లాంటి పెద్ద ఆటగాళ్లు లేకపోయినా.. భారత్‌కు బలమైన రిజర్వ్ బెంచ్ ఉండటం.. లిమిటెడ్ ఓవర్ స్పెషలిస్టులు బోలెడంతమంది అందుబాటులో ఉండటంతో ఈ సిరీస్‌కు జట్టును పంపడంలో బీసీసీఐకి ఎలాంటి ఇబ్బంది లేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీ షా లాంటి కుర్రాళ్లు ఈ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈ పర్యటన ద్వారా యువ ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కడమే కాక.. బీసీసీఐకి మంచి ఆదాయమూ లభిస్తుంది. మరి జట్టు లంకలో ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.

This post was last modified on May 10, 2021 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

51 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago