ఇండియన్ ప్రిిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా వాయిదా పడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కరోనా కల్లోల సమయంలో అన్ని వినోదాలూ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఐపీఎల్తోనే ఉపశమనం పొందుతున్న అభిమానులకు ఈ పరిణామం ఎంతమాత్రం రుచించలేదు. ముందు లీగ్ ఆపేస్తున్నట్లు వార్త బయటికి రాగానే.. కొన్ని రోజులు విరామం ఇచ్చి, ఆ తర్వాత మ్యాచ్లు జరిపిస్తారని అనుకున్నారు.
కానీ అలా కాకుండా లీగ్ను వాయిదా వేస్తున్నారని.. ఆటగాళ్లు సహా అందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోతున్నారని.. ఇప్పట్లో మ్యాచ్లు ఉండవని సమాచారం బయటికి రాగానే అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. ఇప్పుడిలా వాయిదా పడ్డ టోర్నీ మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారంతా. ఐతే మళ్లీ ఎప్పుడు లీగ్ను కొనసాగించే అవకాశముందో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ హింట్ ఇచ్చాడు.
ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్లో మిగతా మ్యాచ్లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని గంగూలీ వెల్లడించాడు. కానీ అప్పుడు మ్యాచ్లు నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు.టీ20 ప్రపంచకప్ అక్టోబరు మధ్యలో మొదలు కావాల్సి ఉంది. ఐతే సెప్టెంబరు 14 వరకు భారత జట్టు.. ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ఆడాల్సి ఉంది. అంటే మధ్యలో నెల రోజుల ఖాళీ ఉంటుంది. కానీ ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యమిచ్చినా, లేదా మరో చోట టోర్నీ జరిగినా కరోనా భయం ఉంటుంది కాబట్టి రెండు వారాల ముందే ఆటగాళ్లు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన వెంటనే ఐపీఎల్ ఆడలేరు. కొంచెం విరామం కావాలి. కాబట్టి గంగూలీ చెబుతున్నట్లు టీ20 ప్రపంచకప్కు ముందు అన్ని దేశాల ఆటగాళ్లను ఒక చోటికి చేర్చి ఐపీఎల్లో మిగతా 31 మ్యాచ్లను పూర్తి చేయడం అంత తేలిక కాదు. ఇక నవంబరు నెలాఖర్లో టీ20 ప్రపంచకప్ అయ్యాక ఐపీఎల్ను పున:ప్రారంభించే వీలుంది కానీ.. అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు యాషెస్ సిరీస్. ఆ రెండు దేశాల స్టార్లు లేకుండా ఐపీఎల్ ఆడిస్తే టోర్నీ కళ తప్పొచ్చు. అయినా పర్వాలేదనుకుంటే అప్పుడు లీగ్ను జరిపించడానికి అవకాశముంది.
This post was last modified on May 7, 2021 9:08 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…