ఇండియన్ ప్రిిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా వాయిదా పడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కరోనా కల్లోల సమయంలో అన్ని వినోదాలూ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఐపీఎల్తోనే ఉపశమనం పొందుతున్న అభిమానులకు ఈ పరిణామం ఎంతమాత్రం రుచించలేదు. ముందు లీగ్ ఆపేస్తున్నట్లు వార్త బయటికి రాగానే.. కొన్ని రోజులు విరామం ఇచ్చి, ఆ తర్వాత మ్యాచ్లు జరిపిస్తారని అనుకున్నారు.
కానీ అలా కాకుండా లీగ్ను వాయిదా వేస్తున్నారని.. ఆటగాళ్లు సహా అందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోతున్నారని.. ఇప్పట్లో మ్యాచ్లు ఉండవని సమాచారం బయటికి రాగానే అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. ఇప్పుడిలా వాయిదా పడ్డ టోర్నీ మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారంతా. ఐతే మళ్లీ ఎప్పుడు లీగ్ను కొనసాగించే అవకాశముందో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ హింట్ ఇచ్చాడు.
ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్లో మిగతా మ్యాచ్లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని గంగూలీ వెల్లడించాడు. కానీ అప్పుడు మ్యాచ్లు నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు.టీ20 ప్రపంచకప్ అక్టోబరు మధ్యలో మొదలు కావాల్సి ఉంది. ఐతే సెప్టెంబరు 14 వరకు భారత జట్టు.. ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ఆడాల్సి ఉంది. అంటే మధ్యలో నెల రోజుల ఖాళీ ఉంటుంది. కానీ ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యమిచ్చినా, లేదా మరో చోట టోర్నీ జరిగినా కరోనా భయం ఉంటుంది కాబట్టి రెండు వారాల ముందే ఆటగాళ్లు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన వెంటనే ఐపీఎల్ ఆడలేరు. కొంచెం విరామం కావాలి. కాబట్టి గంగూలీ చెబుతున్నట్లు టీ20 ప్రపంచకప్కు ముందు అన్ని దేశాల ఆటగాళ్లను ఒక చోటికి చేర్చి ఐపీఎల్లో మిగతా 31 మ్యాచ్లను పూర్తి చేయడం అంత తేలిక కాదు. ఇక నవంబరు నెలాఖర్లో టీ20 ప్రపంచకప్ అయ్యాక ఐపీఎల్ను పున:ప్రారంభించే వీలుంది కానీ.. అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు యాషెస్ సిరీస్. ఆ రెండు దేశాల స్టార్లు లేకుండా ఐపీఎల్ ఆడిస్తే టోర్నీ కళ తప్పొచ్చు. అయినా పర్వాలేదనుకుంటే అప్పుడు లీగ్ను జరిపించడానికి అవకాశముంది.
This post was last modified on May 7, 2021 9:08 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…