ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తున్న సమయంలో రష్యా శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ల రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్, స్పుత్నిక్, ఫైజర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్లో రెండు డోసులు తప్పనిసరి. పైగా సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం కూడా ఉందని వ్యాక్సిన్ తీసుకునేవారు ఆవేదన చెందుతున్నారు. దీంతో తొలి నాళ్లలో దీనిపై పెద్దగా ఆసక్తి కూడా లేకుండా పోయింది.
అయితే.. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో దేహంలో యాంటీబాడీలను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక, రెండు డోసులు తీసుకోవాల్సి ఉండడం తో.. దేశంలో వ్యాక్సిన్ కొరత కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమస్యలు.. కరోనా తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న రష్యా.. సరికొత్తగా మరో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఒక్క డోసుతో సరిపోతుందని.. మంచి ఫలితం కూడా వస్తోందని.. అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు.
రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున… వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది.
స్పుత్నిక్ లైట్ విశేషాలు..
This post was last modified on May 6, 2021 9:16 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…