Trends

ర‌ష్యా కొత్త వ్యాక్సిన్‌.. ఒక్క డోసు చాలట‌.. రిజ‌ల్ట్ సూప‌ర్‌!!

ప్ర‌పంచాన్ని క‌రోనా క‌మ్మేస్తున్న స‌మ‌యంలో ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు గొప్ప శుభ‌వార్త చెప్పారు. క‌రోనాపై పోరులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్‌ల రూప‌క‌ల్ప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవ్యాగ్జిన్‌, స్పుత్నిక్, ఫైజ‌ర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్‌లో రెండు డోసులు త‌ప్ప‌నిస‌రి. పైగా సైడ్ ఎఫెక్టులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని వ్యాక్సిన్ తీసుకునేవారు ఆవేద‌న చెందుతున్నారు. దీంతో తొలి నాళ్ల‌లో దీనిపై పెద్ద‌గా ఆస‌క్తి కూడా లేకుండా పోయింది.

అయితే.. దేశంలో క‌రోనా తీవ్ర‌త పెరిగిన నేప‌థ్యంలో దేహంలో యాంటీబాడీల‌ను పెంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ఇప్పుడు వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌కు క్యూ క‌డుతున్నారు. ఇక‌, రెండు డోసులు తీసుకోవాల్సి ఉండ‌డం తో.. దేశంలో వ్యాక్సిన్ కొర‌త కూడా వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ స‌మ‌స్య‌లు.. క‌రోనా తీవ్ర‌త వంటి అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ర‌ష్యా.. స‌రికొత్త‌గా మ‌రో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇది ఒక్క డోసుతో స‌రిపోతుంద‌ని.. మంచి ఫ‌లితం కూడా వ‌స్తోంద‌ని.. అంటున్నారు ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు.

రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున… వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది.

స్పుత్నిక్ లైట్ విశేషాలు..

  • కరోనా నుంచి రక్షణలో 79.4శాతం సమర్థత.
  • టీకా తీసుకున్న 28వ రోజునే 91.7% మందిలో యాంటీబాడీలు అభివృద్ధి.
  • 100 శాతం మందిలో కరోనా ఎస్-ప్రొటీన్ను ఎదుర్కొనే శక్తి అభివృద్ధి.
  • రోగ నిరోధక శక్తి ఉన్నవారిలో టీకా తీసుకున్న 10 రోజులకే 40 రెట్లు పెరిగిన యాంటీబాడీల స్థాయి.
Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

7 seconds ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

2 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago