ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తున్న సమయంలో రష్యా శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ల రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్, స్పుత్నిక్, ఫైజర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్లో రెండు డోసులు తప్పనిసరి. పైగా సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం కూడా ఉందని వ్యాక్సిన్ తీసుకునేవారు ఆవేదన చెందుతున్నారు. దీంతో తొలి నాళ్లలో దీనిపై పెద్దగా ఆసక్తి కూడా లేకుండా పోయింది.
అయితే.. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో దేహంలో యాంటీబాడీలను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక, రెండు డోసులు తీసుకోవాల్సి ఉండడం తో.. దేశంలో వ్యాక్సిన్ కొరత కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమస్యలు.. కరోనా తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న రష్యా.. సరికొత్తగా మరో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఒక్క డోసుతో సరిపోతుందని.. మంచి ఫలితం కూడా వస్తోందని.. అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు.
రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున… వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది.
స్పుత్నిక్ లైట్ విశేషాలు..
This post was last modified on May 6, 2021 9:16 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…