ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తున్న సమయంలో రష్యా శాస్త్రవేత్తలు గొప్ప శుభవార్త చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ల రూపకల్పన జరిగిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్, స్పుత్నిక్, ఫైజర్ బయోఎన్ టెక్.. ఇలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిని రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల గ్యాప్లో రెండు డోసులు తప్పనిసరి. పైగా సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం కూడా ఉందని వ్యాక్సిన్ తీసుకునేవారు ఆవేదన చెందుతున్నారు. దీంతో తొలి నాళ్లలో దీనిపై పెద్దగా ఆసక్తి కూడా లేకుండా పోయింది.
అయితే.. దేశంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో దేహంలో యాంటీబాడీలను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక, రెండు డోసులు తీసుకోవాల్సి ఉండడం తో.. దేశంలో వ్యాక్సిన్ కొరత కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమస్యలు.. కరోనా తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న రష్యా.. సరికొత్తగా మరో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఒక్క డోసుతో సరిపోతుందని.. మంచి ఫలితం కూడా వస్తోందని.. అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు.
రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున… వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది.
స్పుత్నిక్ లైట్ విశేషాలు..
This post was last modified on May 6, 2021 9:16 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…