Trends

ఆ క్రికెటర్ ఇంట్లో పది మందికి పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లోని వారంతా కరోనా పాజిటివ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లోని వారందరికి కరోనాగా తేలటం గమనార్హం. ఈ విషయాన్ని అశ్విన్ సతీమణి పృథ్వీ నారాయణన్‌ స్వయంగా వెల్లడించారు.

తాజాగా ట్వీట్ చేసిన ఆమె.. తాము శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. గత వారమే అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగటం తెలిసిందే. తన వారిని రక్షించుకోవటం కోసం తాను టోర్నీ నుంచి తొలిగినట్లుగా చెప్పారు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన తొలి భారత క్రికెటర్ అశ్విన్ కావటం గమనార్హం. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారు.. నలుగురు పిల్లలకు పాజిటివ్ అని తేలటంతో.. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో.. ఆసుపత్రుల్లో చేరారు.

దీనిపై స్పందించిన అశ్విన్ సతీమణి.. వారమంతా ఒక పీడకలలా గడిచిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. టీకా వేసుకోవాలని ఆమె కోరారు. సగటుజీవితో పోలిస్తే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లో కరోనాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సదరు క్రికెటర్ ఇంట్లోని వారందరికి పాజిటివ్ గా తేలిన వైనం చూస్తే.. కరోనా విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం అశ్విన్ అనుభవం చెబుతుందని చెప్పాలి.

This post was last modified on May 1, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

29 minutes ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

5 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

7 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

8 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

9 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

10 hours ago