దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లోని వారంతా కరోనా పాజిటివ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లోని వారందరికి కరోనాగా తేలటం గమనార్హం. ఈ విషయాన్ని అశ్విన్ సతీమణి పృథ్వీ నారాయణన్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా ట్వీట్ చేసిన ఆమె.. తాము శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. గత వారమే అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగటం తెలిసిందే. తన వారిని రక్షించుకోవటం కోసం తాను టోర్నీ నుంచి తొలిగినట్లుగా చెప్పారు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన తొలి భారత క్రికెటర్ అశ్విన్ కావటం గమనార్హం. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారు.. నలుగురు పిల్లలకు పాజిటివ్ అని తేలటంతో.. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో.. ఆసుపత్రుల్లో చేరారు.
దీనిపై స్పందించిన అశ్విన్ సతీమణి.. వారమంతా ఒక పీడకలలా గడిచిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. టీకా వేసుకోవాలని ఆమె కోరారు. సగటుజీవితో పోలిస్తే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లో కరోనాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సదరు క్రికెటర్ ఇంట్లోని వారందరికి పాజిటివ్ గా తేలిన వైనం చూస్తే.. కరోనా విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం అశ్విన్ అనుభవం చెబుతుందని చెప్పాలి.
This post was last modified on May 1, 2021 10:08 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…