Trends

ఆ క్రికెటర్ ఇంట్లో పది మందికి పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లోని వారంతా కరోనా పాజిటివ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లోని వారందరికి కరోనాగా తేలటం గమనార్హం. ఈ విషయాన్ని అశ్విన్ సతీమణి పృథ్వీ నారాయణన్‌ స్వయంగా వెల్లడించారు.

తాజాగా ట్వీట్ చేసిన ఆమె.. తాము శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. గత వారమే అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగటం తెలిసిందే. తన వారిని రక్షించుకోవటం కోసం తాను టోర్నీ నుంచి తొలిగినట్లుగా చెప్పారు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన తొలి భారత క్రికెటర్ అశ్విన్ కావటం గమనార్హం. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారు.. నలుగురు పిల్లలకు పాజిటివ్ అని తేలటంతో.. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో.. ఆసుపత్రుల్లో చేరారు.

దీనిపై స్పందించిన అశ్విన్ సతీమణి.. వారమంతా ఒక పీడకలలా గడిచిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. టీకా వేసుకోవాలని ఆమె కోరారు. సగటుజీవితో పోలిస్తే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లో కరోనాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సదరు క్రికెటర్ ఇంట్లోని వారందరికి పాజిటివ్ గా తేలిన వైనం చూస్తే.. కరోనా విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం అశ్విన్ అనుభవం చెబుతుందని చెప్పాలి.

This post was last modified on May 1, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

48 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago