Trends

బ్రేకింగ్‌: కూక‌ట్‌ప‌ల్లి లో కాల్పులు.. గార్డు మృతి.. 5 ల‌క్ష‌ల దోపిడీ!

హైద‌రాబాద్ న‌డిబొడ్డు ప్రాంతం.. కూక‌ట్‌ప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి ఆల్విన్‌ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న హెచ్‌డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై దాడి చేసి.. తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విష‌యంలోకి వెళ్తే.. గురువారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త‌, క‌రోనా కార‌ణంగా జ‌న‌స‌మ్మ‌ర్థంత‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్స‌ర్ బైక్‌పై దూసుకుని వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు.. క్ష‌ణాల్లో ఏటీఎంలోకి దూసుకువెళ్లారు. నిజానికి ఆ స‌మ‌యంలో ఏటీఎంలో డ‌బ్బు నింపుతున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఏటీఎం ద‌గ్గ‌ర కాప‌లా కాస్తున్నారు.

అయితే.. దూసుకునివ‌చ్చిన యువ‌కులు.. ఇద్ద‌రూ ముందు సెక్యూరిటీ గార్డుల‌పై దాడి చేసి కాల్పులు జ‌రిపారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకునే లోగానే.. దుండ‌గులు ఏటీఎంలో పెడుతున్న క్యాష్ నుంచి రూ.5 ల‌క్ష‌లు దోచుకువెళ్లారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో అలీ అనే సెక్యూరిటీ గార్డు మృతి చెంద‌గా.. మ‌రో గార్డు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. విష‌యంపై ఆరాతీస్తున్నారు. దుండగులు ఇద్ద‌రూ 25 ఏళ్ల‌లోపు వారేన‌ని పోలీసులు భావిస్తున్నారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏటీఎంలో డ‌బ్బులు నింపుతున్న స‌మ‌యంలోనే దుండ‌గులు ఎందుకు వ‌చ్చారు? వారికి ముందుగానే స‌మాచారం అందిందా? లేక ఇంటి దొంగ‌లే ఈ ప్లాన్ చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంటుంద‌ని అంటున్నారు పోలీసులు. ఏదేమైనా.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

3 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

32 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

58 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

59 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago