Trends

బ్రేకింగ్‌: కూక‌ట్‌ప‌ల్లి లో కాల్పులు.. గార్డు మృతి.. 5 ల‌క్ష‌ల దోపిడీ!

హైద‌రాబాద్ న‌డిబొడ్డు ప్రాంతం.. కూక‌ట్‌ప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి ఆల్విన్‌ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న హెచ్‌డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై దాడి చేసి.. తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విష‌యంలోకి వెళ్తే.. గురువారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త‌, క‌రోనా కార‌ణంగా జ‌న‌స‌మ్మ‌ర్థంత‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్స‌ర్ బైక్‌పై దూసుకుని వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు.. క్ష‌ణాల్లో ఏటీఎంలోకి దూసుకువెళ్లారు. నిజానికి ఆ స‌మ‌యంలో ఏటీఎంలో డ‌బ్బు నింపుతున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఏటీఎం ద‌గ్గ‌ర కాప‌లా కాస్తున్నారు.

అయితే.. దూసుకునివ‌చ్చిన యువ‌కులు.. ఇద్ద‌రూ ముందు సెక్యూరిటీ గార్డుల‌పై దాడి చేసి కాల్పులు జ‌రిపారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకునే లోగానే.. దుండ‌గులు ఏటీఎంలో పెడుతున్న క్యాష్ నుంచి రూ.5 ల‌క్ష‌లు దోచుకువెళ్లారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో అలీ అనే సెక్యూరిటీ గార్డు మృతి చెంద‌గా.. మ‌రో గార్డు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. విష‌యంపై ఆరాతీస్తున్నారు. దుండగులు ఇద్ద‌రూ 25 ఏళ్ల‌లోపు వారేన‌ని పోలీసులు భావిస్తున్నారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏటీఎంలో డ‌బ్బులు నింపుతున్న స‌మ‌యంలోనే దుండ‌గులు ఎందుకు వ‌చ్చారు? వారికి ముందుగానే స‌మాచారం అందిందా? లేక ఇంటి దొంగ‌లే ఈ ప్లాన్ చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంటుంద‌ని అంటున్నారు పోలీసులు. ఏదేమైనా.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on April 29, 2021 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

57 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

4 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago