హైదరాబాద్ నడిబొడ్డు ప్రాంతం.. కూకట్పల్లిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఆల్విన్ ప్రధాన రహదారిపై ఉన్న హెచ్డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్తోపాటు ఏటీఎం సిబ్బందిపై దాడి చేసి.. తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయంలోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎండ తీవ్రత, కరోనా కారణంగా జనసమ్మర్థంతక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పల్సర్ బైక్పై దూసుకుని వచ్చిన ఇద్దరు యువకులు.. క్షణాల్లో ఏటీఎంలోకి దూసుకువెళ్లారు. నిజానికి ఆ సమయంలో ఏటీఎంలో డబ్బు నింపుతున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఏటీఎం దగ్గర కాపలా కాస్తున్నారు.
అయితే.. దూసుకునివచ్చిన యువకులు.. ఇద్దరూ ముందు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే.. దుండగులు ఏటీఎంలో పెడుతున్న క్యాష్ నుంచి రూ.5 లక్షలు దోచుకువెళ్లారు. ఈ కాల్పుల ఘటనలో అలీ అనే సెక్యూరిటీ గార్డు మృతి చెందగా.. మరో గార్డు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. విషయంపై ఆరాతీస్తున్నారు. దుండగులు ఇద్దరూ 25 ఏళ్లలోపు వారేనని పోలీసులు భావిస్తున్నారు.
అయితే.. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సమయంలోనే దుండగులు ఎందుకు వచ్చారు? వారికి ముందుగానే సమాచారం అందిందా? లేక ఇంటి దొంగలే ఈ ప్లాన్ చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంటుందని అంటున్నారు పోలీసులు. ఏదేమైనా.. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ కాల్పుల ఘటన సంచలనంగా మారింది.
This post was last modified on April 29, 2021 4:09 pm
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…