Trends

కరోనా పేషంట్లు మిస్సింగ్ ?

ఇపుడిదే విషయం తిరుపతిలోని ఉన్నతాధికారులను టెన్షన్ పెట్టేస్తోంది. గడచిన రెండు నెలలుగా ఒక్క తిరుపతిలోనే 9600 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో అత్యధికులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. కొందరు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మరికొందరు హోం ఐసొలేషన్లో ఉన్నారు. మరికొందరు చుట్టుపక్కలున్న తమ ఊర్లకు వెళ్ళిపోయారు. ఈ నాలుగు తరగతుల రోగుల లెక్క అధికారుల దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి సమస్యా లేదు.

అయితే ఐదో తరగతి రోగులు కూడా ఉన్నారట. వీళ్ళసంఖ్య సుమారు 1050 దాకా ఉంది. వీళ్ళ వల్లే ఉన్నతాధికారులు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పైన చెప్పినట్లుగా 9600 మంది కరోనా వైరస్ సోకిన రోగుల్లో ఇపుడు 1050 మంది అడ్రస్ దొరకటంలేదని సమాచారం. వీళ్ళ ఆచూకీ కోసం అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.

జరిగిందేమిటంటే చాలామందిలాగే వీళ్ళు కూడా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకునేటపుడు మొబైల్ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఇచ్చారు. అయితే పరీక్షల్లో వీళ్ళకు కరోనా వైరస్ సోకినట్లు వచ్చింది. అదే విషయం వీళ్ళకు చెబుదామని వైద్య సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ లేదా పనిచేయటం లేదని వస్తోందట. ఇక ఇంటి అడ్రస్ కు వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తే అలాంటి పేరుగలవారు ఎవరు అడ్రస్ లో లేరని చెప్పారట.

అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే మొబైల్ నెంబర్ లేదా ఇంటి అడ్రస్ రెండు తప్పుడువే. కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి ? ఎందుకు మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ ఎందుకు తప్పుడువి ఇవ్వాలి ? ఇపుడిదే ప్రశ్న అధికారులను వేధిస్తోంది. వీళ్ళంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ? ఎంతమందికి అంటించారో అర్ధం కావటంలేదు. అందుకనే అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on April 29, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైలెంట్ అయితే ఎలా సామ్

సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…

9 minutes ago

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

4 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

5 hours ago

సాయిపల్లవిని చూడ్డానికి కూడా రారా?

ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…

7 hours ago

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

8 hours ago

సుకుమార్ ఎంత సమయం తీసుకుంటారో

కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…

13 hours ago