ఆయన పేరు నారాయణ్ రావు దబార్కర్. వయసు 85 సంవత్సరాలు. మహారాష్ట్రాలోని నాగపూర్ ఆయన స్వస్థలం. దశాబ్దాల నుంచి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో పని చేస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది నుంచి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఇటీవల అది పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నారాయణ్ రావు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది. ఆయన కుటుంబ సభ్యులు ఎంత కష్టపడ్డా బెడ్ దొరకలేదు.
కొన్ని రోజుల ప్రయత్నం తర్వాత.. నారాయణ్కు ఉన్న మంచి పేరు వల్ల ఒక ఆసుపత్రిలో బెడ్ లభించింది. నారాయణ్ రావును హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిచడం కోసం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. కానీ అదే సమయానికి ఒక యువకుడు విషమ పరిస్థితిలో కనిపించాడు. అతడికి బెడ్ అత్యవసరం. ఆ యువకుడికి పెళ్లయింది. పక్కనే భార్య కూడా కనిపించింది. నారాయణ్ రావు వాళ్ల పరిస్థితి చూసి కదిలిపోయాడు.
ఈ స్థితిలో మరొకరు ఉంటే.. తమ స్వార్థమే చూసుకుంటారు. ఇంత కష్టపడి బెడ్ సాధించి ఇంకొకరికి ఇవ్వడం ఎందుకు అనుకుంటారు. కానీ నారాయణ్ మాత్రం అలా చేయలేదు. తన వయసు 85 ఏళ్లు అని.. జీవితంలో చూడాల్సిందంతా చూసేశానని.. తన కంటే ఆ కుర్రాడికే బెడ్ అవసరమని అన్నారు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా తన కోసం కేటాయించిన బెడ్ను ఆ కుర్రాడికి ఇప్పించారు. ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
ఇలా వెళ్లిన మూడు రోజులకు నారాయణ్ కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆయన చేసిన త్యాగం వల్ల ఆసుపత్రిలో ఒక యువకుడి ప్రాణం నిలబడింది. నారాయణ్ రావు చేసిన త్యాగం గురించి కొంత ఆలస్యంగా మీడియాలోకి సమాచారం వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…