ఆయన పేరు నారాయణ్ రావు దబార్కర్. వయసు 85 సంవత్సరాలు. మహారాష్ట్రాలోని నాగపూర్ ఆయన స్వస్థలం. దశాబ్దాల నుంచి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో పని చేస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది నుంచి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఇటీవల అది పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నారాయణ్ రావు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది. ఆయన కుటుంబ సభ్యులు ఎంత కష్టపడ్డా బెడ్ దొరకలేదు.
కొన్ని రోజుల ప్రయత్నం తర్వాత.. నారాయణ్కు ఉన్న మంచి పేరు వల్ల ఒక ఆసుపత్రిలో బెడ్ లభించింది. నారాయణ్ రావును హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిచడం కోసం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. కానీ అదే సమయానికి ఒక యువకుడు విషమ పరిస్థితిలో కనిపించాడు. అతడికి బెడ్ అత్యవసరం. ఆ యువకుడికి పెళ్లయింది. పక్కనే భార్య కూడా కనిపించింది. నారాయణ్ రావు వాళ్ల పరిస్థితి చూసి కదిలిపోయాడు.
ఈ స్థితిలో మరొకరు ఉంటే.. తమ స్వార్థమే చూసుకుంటారు. ఇంత కష్టపడి బెడ్ సాధించి ఇంకొకరికి ఇవ్వడం ఎందుకు అనుకుంటారు. కానీ నారాయణ్ మాత్రం అలా చేయలేదు. తన వయసు 85 ఏళ్లు అని.. జీవితంలో చూడాల్సిందంతా చూసేశానని.. తన కంటే ఆ కుర్రాడికే బెడ్ అవసరమని అన్నారు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా తన కోసం కేటాయించిన బెడ్ను ఆ కుర్రాడికి ఇప్పించారు. ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
ఇలా వెళ్లిన మూడు రోజులకు నారాయణ్ కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆయన చేసిన త్యాగం వల్ల ఆసుపత్రిలో ఒక యువకుడి ప్రాణం నిలబడింది. నారాయణ్ రావు చేసిన త్యాగం గురించి కొంత ఆలస్యంగా మీడియాలోకి సమాచారం వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on April 29, 2021 10:02 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…