అవసరంలో ఆదుకుంటామని ఒకవైపు ప్రకటనలు ఇస్తోంది. అయితే చేతల్లో మాత్రం భారత్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనతోనే పావులు కదుపుతోంది. అంటే ప్రపంచదేశాల దృష్టిలో తాను మంచిదేశమని అనిపించుకోవాలన్న తపనే కనబడుతోంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి మనదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అంతా చేస్తోంది. తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా మనదేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఎంతలా పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 3.5 లక్షల కేసులు నమోదవ్వగా 2875 మంది మరణించారు. మరణాల్లో అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవటమే ప్రధాన కారణమవుతోంది. ఈ కారణంపైనే చైనా పాలకులు భారతదేశం అవసరాలకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని బ్రహ్మాండమైన ప్రకటనలు ఇచ్చారు. ఆక్సిజన్ పరికరాలను కూడా సరఫరా చేయనున్నట్లు చెప్పారు.
ఒకవైపు సాయం ప్రకటనలు చేసిన ప్రభుత్వం మరోవైపు ఛైనా-భారత్ మధ్య 15 రోజులపాటు కార్గో విమానసర్వీసులను రద్దుచేసింది. దీని కారణంగా చైనా నుండి మనదేశానికి రావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మందులు, ఇతర వైద్యపరికరాల సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలను 40 శాతం పెంచేసింది.
అలాగే మందులు, ఇతర వైద్యపరికరాలకు సంబంధించిన ముడిసరుకు ధరలను కూడా 20 శాతం పెంచేసింది. చైనా విమాన సర్వీసులను నిలిపేసిన కారణంగా భారత్ కు రావాల్సిన విమానాలన్నీ సింగపూర్ లాంటి దేశాల మీదగానే రావాల్సుంటుంది. దీనివల్ల ఎక్కువ టైం పట్టడమే కాకుండా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కాలంలో మనదేశంలో పరిస్ధితులు తెలిసి కూడా కావాలనే చైనా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంతా పెడుతోంది. దీంతో డ్రాగన్ అసలు రూపం ఏమిటో మరోసారి ప్రపంచదేశాలకు తెలిసిపోయింది.
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…