Trends

హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కంప్లైంట్ చేయొచ్చు

కరోనా సెకండ్ వేవ్ వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండేందుకు ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన శాఖలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మూడు పోలీసు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) లోని ముగ్గురు పోలీసు కమిషనర్లు (అంజనీకుమార్, సజ్జన్నార్, మహేశ్ భగవత్) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు తీసుకునే నిర్ణయాలు చూసినప్పుడు.. మిగిలిన వారి కంటే వారే బెటర్ అన్న భావన కలుగక మానదు. సాధారణంగా పోలీసులు పోలీసింగ్ చేయటం.. నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. భద్రతా ఏర్పాట్లు చేయటం లాంటివి చేస్తుంటారు.

అందుకు భిన్నంగా మహానగర ప్రజలకు వివిధ రూపాల్లో సాయం చేసేందుకు వీలుగా కార్యక్రమాల్నినిర్వహించటం గడిచిన కొద్దికాలంగా చూస్తున్నాం. సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ.. మరోసారి ఈ పోలీస్ త్రిమూర్తులు రంగంలోకి దిగారు. ఎవరికి తోచిన రీతిలో వారు సహాయ కార్యక్రమాల్ని చేపట్టారు. తమ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు వీలైనన్ని ఎక్కువ సదుపాయాలు కల్పించేలా వారి నిర్ణయాలు ఉండటం గమనార్హం. నేతల కంటే వీరి తీరే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తాజాగా ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం ఉన్న వారు.. ఇప్పుడున్నపరిస్థితుల్లో రావొద్దని.. అందుకు బదులు 9490616780 నెంబరుకు ఫోన్ చేస్తే 24 గంటల పాటు ప్రత్యేక హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఒక లిస్టు విడుదల చేశారు. ధర్నాలు.. ఆందోళనలు లాంటివి చేయొద్దని.. ఎంతో అవసరమైతే పోలీస్ స్టేషన్ కు రావొద్దని.. దానికి బదులు తామిచ్చిన నెంబరును వినియోగించుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరోలాంటి సేవల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్సు సేవలు చాలా అవసరం. ఆసుపత్రికి వెళ్లాలన్నా.. ఆసుపత్రి నుంచి ఇంటికి రావాలన్నా.. ఇలా ప్రతి సందర్భంలోనూ అవసరమయ్యే అంబులెన్సు సేవల్నిఅందుబాటులోకి తీసుకొచ్చారు సైబరాబాద్ కమిసనర్ సజ్జన్నార్. 94906 17400, 94906 17431 నెంబర్లకు ఫోన్ చేస్తే.. అంబులెన్సు సేవల్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం 12 అంబులెన్సుల్ని అందుబాటులోకి తేవటమే కాదు.. మరో రెండు మూడు రోజుల్లో టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు వైద్యులతో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్.. సైబరాబాద్ పోలీసులకు తగ్గట్లే రాచకొండ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ వినూత్న రీతిలో కొత్త సర్వీసుల్ని తీసుకొచ్చారు. ఉదయం వేళలో వ్యాక్సిన్ల కోసం వెళ్లే వారికి క్యాబ్ సర్వీసును ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అవసరమైతే ఎలాంటి వసతి దొరకని దుస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం మహీంద్రా లాజిస్టిక్స్ సాయంతో ఉచిత క్యాబ్ సర్వీసును తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకోసం 94906 17234 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా.. ఏ కమిషనరేట్ కు సంబంధించిన ఆ పోలీసు కమిషనరేట్ సీపీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. నగర జీవులకు ఉపయుక్తంగా మారాయని చెప్పక తప్పదు.

This post was last modified on April 26, 2021 10:58 am

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

10 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

10 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

11 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

12 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

13 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

14 hours ago