ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినపుడు.. జనాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. వ్యాక్సిన్ వేసుకోవడానికి జనాలు రాక టీకా కేంద్రాలు వెలవెలబోయిన పరిస్థితి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని జనాలు మిన్నకుండిపోయారు. వ్యాక్సిన్ ప్రభావాల మీద కూడా రకరకాల ప్రచారాలు జరగడం ఈ వ్యతిరేకతకు కారణం. కానీ గత కొన్ని వారాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడం, ఫస్ట్ వేవ్ను మించి ప్రమాదకర పరిస్థితులు రావడంతో ఇప్పుడు అందరిలోనూ భయం పుడుతోంది. వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. టీకా కేంద్రాలు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. కానీ డిమాండ్కు సరఫరా టీకాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది. విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిపై ఆంక్షలు తొలగిపోవడం, దేశీయంగా వివిధ సంస్థలు పెద్ద ఎత్తున కొత్తగా టీకాలు సిద్ధం చేస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నారు.
ఐతే ఎంత చేసినా ఇలా సూది మందు రూపంలో వ్యాక్సిన్ వేసుకోవడం, శరీరంలో యాంటీ బాడీస్ తయారవడం.. ఇదంతా పెద్ద, సుదీర్ఘ ప్రక్రియ. ఇలా కాకుండా జలుబు ఉన్న వాళ్లు ముక్కులో డ్రాప్స్ వేసుకున్నట్లుగా వ్యాక్సిన్ వేసుకుంటే, వెంటనే వైరస్ చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని ఫార్మాసూటికల్ సంస్థలు ఇవే ప్రయోగాలు చేస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున టీకాలు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే ఈ దిశగా కీలక ముందడుగు వేసింది.
నాజిల్ స్ప్రే రూపంలో వ్యాక్సిన్ను తయారు చేసింది. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ఆమోదం లభిస్తే వ్యాక్సినేషన్ చాలా సులభం అయిపోతుందని, సత్వరం వైరస్ నిరోధక శక్తి వస్తుందని అంటున్నారు. కొవిడ్పై పోరాటంలో ఇది కీలక ముందడుగు అవుతుందని కూడా నిపుణులు అంటున్నారు. త్వరలోనే భారత్ బయోటెక్ నాజిల్ స్ప్ర్రే వ్యాక్సిన్కు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు.
This post was last modified on April 26, 2021 8:04 am
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…