Trends

వైర‌ల్ వీడియో.. రైల్వే ట్రాక్‌పై అద్భుతం


నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాను ఒక మీడియా ముంచెత్తుతోంది. ఒక రైల్వే స్టేష‌న్లో అవ‌త‌లి నుంచి రైలు దూసుకొస్తుండ‌గా.. ట్రాక్ మీద ప‌డ్డ పిల్లాడిని ఆ స్టేష‌న్లో విధులు నిర్వ‌ర్తించే పాయింట్స్ మ్యాన్ క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ప్రాణాల‌కు తెగించిన తీరు అబ్బుర ప‌రుస్తోంది ఈ వీడియోలో. ముంబ‌యిలోని వాంగ‌ని రైల్వే స్టేష‌న్లో చోటు చేసుకుంది. మ‌యూర్ షేల్కే అనే పాయింట్స్ మ్యాన్ అసాధార‌ణ సాహ‌సంతో హీరో అయ్యాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

వాంగ‌ని రైల్వే స్టేష‌న్లో ఓ మ‌హిళ ఓ పిల్లాడిని వెంట బెట్టుకుని ఫ్లాట్ ఫామ్ మీద న‌డుచుకుంటూ వెళ్లింది. దూరం నుంచి ఫ్లాట్ ఫామ్ మీదికి రాబోతున్న ట్రైన్ ఎక్కాల‌నుకున్నారో ఏమో ఆ ఇద్ద‌రూ ఫ్లాట్ ఫామ్ నుంచి ట్రాక్ వైపుగా క‌దులుతూ వెళ్తారు. ఐతే ప‌ట్టుత‌ప్పిన పిల్లాడు కింద ఉన్న ట్రాక్ మీద ప‌డిపోయాడు. పిల్లాడు లేచి పైకి ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించాడు కానీ.. ఆ మ‌హిళ అత‌ణ్ని అందుకోలేక‌పోయింది. ఇంత‌లో అవ‌త‌లి నుంచి ట్రైన్ దూసుకొస్తోంది. ఈలోపు దూరం నుంచి పాయింట్స్ మ్యాన్ శ‌ర‌వేగంతో ప‌రుగెత్తుకొచ్చాడు.

రెప్ప‌పాటు వ్య‌వ‌ధిలో ఆ పిల్లాడిని పైకి పంపి తాను కూడా పైకొచ్చేశాడు. అత‌నిలా పైకొచ్చాడో లేదో.. ట్రైన్ ట్రాక్ మీది నుంచి దూసుకెళ్లింది. క్ష‌ణం ఆల‌స్యం అయినా ఇద్ద‌రి ప్రాణాలు నిలిచేవి కావు. చూస్తుంటే ఒళ్లు గ‌గొర్పుడుస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో నిన్న రాత్రి నుంచి వైర‌ల్ అవుతోంది. మ‌యూర్ మీద స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అత‌డికి రివార్డు ఇవ్వాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో రైల్వే మంత్రి పియూష్ ఘోష‌ల్ దృష్టికి వెళ్లింది. మ‌యూర్‌ను ఆయ‌న కూడా అభినందించారు.

This post was last modified on April 19, 2021 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago