Trends

సెకండ్ వేవ్: ఇలాంటి లక్షణాలు వస్తే.. అలెర్టు అవ్వాల్సిందే

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెకండ్ వేవ్.. షాకుల మీద షాకులు ఇస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పాజిటివ్ ల జోరు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ లో కరోనా సోకిన వారికి కనిపించిన లక్షణాలకు.. సెకండ్ వేవ్ వేళ.. కనిపిస్తున్న లక్షణాల్లో కాస్తంత మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. నిత్యం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్య నిపుణులు.. తమ వద్దకు వస్తున్న కేసుల ఆధారంగా చేసుకొని కొన్ని లక్షణాల్ని చెబుతున్నారు.

ఇలాంటివి కానీ కనిపిస్తే.. కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని గుర్తించే వీలుందని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనికి కారణం.. కరోనాను ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. శరీరంలోని పలు కీలక వ్యవస్థల్ని దెబ్బ తీసే దుర్మార్గపు లక్షణం దీని సొంతం. వైరస్ ఇంక్యుబేషన్ వ్యవధి మూడు రోజులే ఉండటం.. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించని వారి కారణంగా.. వారు కరోనా వాహకాలుగా మారుతున్నారు. ఈ సూపర్ స్పైడర్ల కారణంగా కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది.
ఇంతకీ.. సెకండ్ వేవ్ వేళ.. మారిన లక్షణాలు.. అప్రమత్తం కావాల్సిన అంశాల్లోకి వెళితే..

–  కొందరికి 3-4 రోజుల పాటు జ్వరం వచ్చి తగ్గి.. మళ్లీ వస్తోంది. ఇంకొందరిలో తీవ్రమైన నీరసం, దమ్ము, ఛాతీలో అసహజంగా ఉంటోంది.
–  పలువురిని తలనొప్పి, వెన్నునొప్పి, గొంతు నొప్పి బాధిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై మచ్చలు, నోటిలో పొక్కులు, ఆకలి లేకపోవడం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
–  జ్వరం మాత్రలు వేసుకున్నాక కూడా తగ్గకపోతే తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలి.
–  కళ్ల కలక మాదిరిగా కరోనా పాజిటివ్స్‌లో కళ్లు చాలా ఎర్రగా తయారవుతున్నాయి. ముందుగా చాలా మంది దీన్ని కంటి ఇన్ఫెక్షన్‌గా భావిస్తున్నారు. కళ్లలో విపరీతమైన నొప్పి, కళ్లు లాగినట్లు అనిపించడం వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. రెండు రోజుల పాటు కళ్లు ఎర్రగా ఉంటే కరోనా ఇన్ఫెక్షన్‌గా అనుమానించాలి.
–  కొందరిలో జ్వరం ఉండదు, దగ్గు అసలే ఉండదు. టెంపరేచర్‌ చెక్‌ చేస్తే 99డిగ్రీల సెల్సియస్‌ ఉంటోంది. వారికి కరోనా సోకినట్లే. పరీక్ష చేయించుకుంటే మంచిది.
–  ఇది వరకు కరోనా తీవ్రత ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడం ఆ వయస్సు వారిలోనే చోటుచేసుకునేవి. ఇప్పుడు 25నుంచి40 ఏళ్ల లోపు వారిలోనూ ఇబ్బందులున్నాయి.
–  కరోనా పాజిటివ్స్‌ కొందరిలో గ్యాస్ట్రో ఎంటారాలజీ సమస్యలు.. 30లోపు వయస్సు వారిలో రెస్పిరేటర్‌, ఆక్సిజన్‌ సమస్యలు కనిపిస్తున్నాయి.
–  అనుమానిత లక్షణాలు కనిపిస్తే.. నిత్యం ఆక్సిజన్ లెవెల్స్ ను పరీక్షించుకోవాలి. 94 కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. ఆసుపత్రిలో చేరటం మంచిది.

This post was last modified on April 18, 2021 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

2 hours ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

3 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

4 hours ago