కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట.
మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకనే ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది.
బ్రేక్ ది చైన్ అంటే అవసరమైతేనే జనాలు రోడ్లపైకి రావాలన్నది అర్ధం. అలాగే జనాలు ఎవరికి వారుగా స్వచ్చంధంగా సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వాళ్ళు కరోనా టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదేపదే చెబుతోంది. ఈ మొత్తంమీద అవసరం లేకుండా జనాలను రోడ్లపైకి రావద్దన్నది చాలా కీలకం.
ఇందులో భాంగానే నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటి ప్రెస్, ఇండియా సెక్యూరిటి ప్రెస్ లో పనిచేసే సిబ్బందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయట. ఆ పరీక్షల్లో చాలామందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దాంతో రెండు ప్రెస్సుల్లో కరెన్సీ ప్రింటిగ్ ను నిలిపేసి ప్రెస్సులను ఈనెల 30వ తేదీవరకు మూసేశారు. రెండు ప్రెస్సుల్లో 3 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎప్పుడైతే రెండోచోట్ల కరోన్సీ ప్రింటింగ్ మూసేశారో కొద్దిరోజుల్లో డబ్బుకు కటకట వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న కరెన్సీ నోట్లలో 40 శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే ప్రింటవుతాయట. ఒక్కసారిగా 40 శాతం కరెన్సీ ప్రింటింగ్ నిలిచిపోయిందంటే మామూలు విషయంకాదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on April 17, 2021 2:41 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…