కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట.
మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకనే ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది.
బ్రేక్ ది చైన్ అంటే అవసరమైతేనే జనాలు రోడ్లపైకి రావాలన్నది అర్ధం. అలాగే జనాలు ఎవరికి వారుగా స్వచ్చంధంగా సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వాళ్ళు కరోనా టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదేపదే చెబుతోంది. ఈ మొత్తంమీద అవసరం లేకుండా జనాలను రోడ్లపైకి రావద్దన్నది చాలా కీలకం.
ఇందులో భాంగానే నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటి ప్రెస్, ఇండియా సెక్యూరిటి ప్రెస్ లో పనిచేసే సిబ్బందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయట. ఆ పరీక్షల్లో చాలామందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దాంతో రెండు ప్రెస్సుల్లో కరెన్సీ ప్రింటిగ్ ను నిలిపేసి ప్రెస్సులను ఈనెల 30వ తేదీవరకు మూసేశారు. రెండు ప్రెస్సుల్లో 3 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎప్పుడైతే రెండోచోట్ల కరోన్సీ ప్రింటింగ్ మూసేశారో కొద్దిరోజుల్లో డబ్బుకు కటకట వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న కరెన్సీ నోట్లలో 40 శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే ప్రింటవుతాయట. ఒక్కసారిగా 40 శాతం కరెన్సీ ప్రింటింగ్ నిలిచిపోయిందంటే మామూలు విషయంకాదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on April 17, 2021 2:41 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…