కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట.
మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకనే ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది.
బ్రేక్ ది చైన్ అంటే అవసరమైతేనే జనాలు రోడ్లపైకి రావాలన్నది అర్ధం. అలాగే జనాలు ఎవరికి వారుగా స్వచ్చంధంగా సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వాళ్ళు కరోనా టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదేపదే చెబుతోంది. ఈ మొత్తంమీద అవసరం లేకుండా జనాలను రోడ్లపైకి రావద్దన్నది చాలా కీలకం.
ఇందులో భాంగానే నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటి ప్రెస్, ఇండియా సెక్యూరిటి ప్రెస్ లో పనిచేసే సిబ్బందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయట. ఆ పరీక్షల్లో చాలామందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దాంతో రెండు ప్రెస్సుల్లో కరెన్సీ ప్రింటిగ్ ను నిలిపేసి ప్రెస్సులను ఈనెల 30వ తేదీవరకు మూసేశారు. రెండు ప్రెస్సుల్లో 3 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎప్పుడైతే రెండోచోట్ల కరోన్సీ ప్రింటింగ్ మూసేశారో కొద్దిరోజుల్లో డబ్బుకు కటకట వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న కరెన్సీ నోట్లలో 40 శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే ప్రింటవుతాయట. ఒక్కసారిగా 40 శాతం కరెన్సీ ప్రింటింగ్ నిలిచిపోయిందంటే మామూలు విషయంకాదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…