కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట.
మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకనే ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది.
బ్రేక్ ది చైన్ అంటే అవసరమైతేనే జనాలు రోడ్లపైకి రావాలన్నది అర్ధం. అలాగే జనాలు ఎవరికి వారుగా స్వచ్చంధంగా సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వాళ్ళు కరోనా టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదేపదే చెబుతోంది. ఈ మొత్తంమీద అవసరం లేకుండా జనాలను రోడ్లపైకి రావద్దన్నది చాలా కీలకం.
ఇందులో భాంగానే నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటి ప్రెస్, ఇండియా సెక్యూరిటి ప్రెస్ లో పనిచేసే సిబ్బందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయట. ఆ పరీక్షల్లో చాలామందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దాంతో రెండు ప్రెస్సుల్లో కరెన్సీ ప్రింటిగ్ ను నిలిపేసి ప్రెస్సులను ఈనెల 30వ తేదీవరకు మూసేశారు. రెండు ప్రెస్సుల్లో 3 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎప్పుడైతే రెండోచోట్ల కరోన్సీ ప్రింటింగ్ మూసేశారో కొద్దిరోజుల్లో డబ్బుకు కటకట వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న కరెన్సీ నోట్లలో 40 శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే ప్రింటవుతాయట. ఒక్కసారిగా 40 శాతం కరెన్సీ ప్రింటింగ్ నిలిచిపోయిందంటే మామూలు విషయంకాదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on April 17, 2021 2:41 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…